AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేస్తున్నారు.. పోలీసులు చోద్యం చూస్తున్నారు.. వైసీపీపై నాదెండ్ల ఫైర్..

వైసీపీ ప్రభుత్వ తీరుపైజనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని నిలదీశారు. పుంగనూరులో...

Andhra Pradesh: ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేస్తున్నారు.. పోలీసులు చోద్యం చూస్తున్నారు.. వైసీపీపై నాదెండ్ల ఫైర్..
Nadendla Manohar
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 05, 2022 | 2:50 PM

వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని నిలదీశారు. పుంగనూరులో రామచంద్రయాదవ్‌ ఇంటిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభ నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్‌ చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారన్న మనోహర్.. ఎదిరించి మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడమానికి అర్హత లేదా అని అన్నారు. వాటిపైనే నిషేధం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రశ్నించే వారు లేకుండా చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే ఇలా దాడులకు తెగబడుతోంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలు దాడులు చేయడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, వాక్‌ స్వాతంత్ర్యానికి విలువ లేనట్టుగా కనిపిస్తోంది. ఈ ఘటనలతో ప్రజాస్వామ్య విలువల పైనే దాడులు జరిగాయని జనసేన భావిస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడమానికి అర్హత లేదా.

– నాదెండ్ల మనోహర్, జనసేన నేత

ఇవి కూడా చదవండి

కాగా.. గత ఎన్నికల్లో జనసేన తరఫున చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయన నియోజక వర్గ రైతుల సమస్యలపై సభ పెట్టారు. అయితే సదుంలో రైతు భేరిని అనుమతి లేదంటూ ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన ఇంటిపై దాడి చేశారు. వస్తువులను ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలగొట్టారు. ఫర్నిచర్‌ను విరగ్గొట్టి, ఆరు కార్లను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని రామచంద్రయాదక్ వర్గీయులు చెబుతున్నారు. ఆయన పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..