AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర.. 41 మంది రైతులకు ఆర్ధిక సాయం..

Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari) నేడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. అన్నదాతకు..

Pawan Kalyan: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర.. 41 మంది రైతులకు ఆర్ధిక సాయం..
Pawan Kalyan West Godavari
Surya Kala
|

Updated on: Apr 23, 2022 | 8:40 AM

Share

Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari) నేడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. అన్నదాతకు అండగా చేపట్టిన ఈ యాత్రలో పలువురు రైతులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. పవన్ కళ్యాణ్ .. హైదరాబాద్ నుంచి బయలుదేరి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయరాయి, ధర్మాజీ గూడెం,  కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి ఏలూరు బైపాస్ మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు.. అక్కడి నుంచి ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి చేరుకోనున్నారు.

పవన్ కళ్యాణ్ చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించనున్నారు. చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో 41 మంది రైతులకు లక్ష రూపాయల చెక్ లు అందించనున్నారు. పవన్ కళ్యాణ్ యాత్ర నేపథ్యంలో ఇప్పటికే జనసేన నేతలు అన్ని ఏర్పాట్లను చేశారు.  ఏలూరు, భీమవరం జిల్లాల్లో అప్పుల బాధతో 41 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇందులో చింతలపూడి నియోజకవర్గంలోనే 31 కుటుంబాలు ఉన్నాయి.

Also Read:  Wonder Kid: 9 ఏళ్ల బాలుడు రికార్డుల వేట.. కళ్ళకు గంతలతో స్కేటింగ్.. మంత్రి రోజా ప్రశంసలు

Afghanistan bomb blast: వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌.. మసీద్‌పై బాంబు దాడి.. చిన్నారులతో సహా 33మంది మృతి