Afghanistan bomb blast: వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌.. మసీద్‌పై బాంబు దాడి.. చిన్నారులతో సహా 33మంది మృతి

వరుస బాంబ్ పేలుళ్లు ఆఫ్ఘనిస్తాన్‌‌ను కకావికలం చేస్తున్నాయి. తాజాగా కుందూజ్‌ ఇమామ్‌ సాహిబ్‌ జిల్లాలోని ఓ ప్రార్ధనా మందిరంలో బాంబు పేలింది.

Afghanistan bomb blast: వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌.. మసీద్‌పై బాంబు దాడి.. చిన్నారులతో సహా 33మంది మృతి
Afghanistan Bomb Blast
Follow us

|

Updated on: Apr 23, 2022 | 8:10 AM

Afghanistan  bomb blast: వరుస బాంబ్ పేలుళ్లు ఆఫ్ఘనిస్తాన్‌‌ను కకావికలం చేస్తున్నాయి. తాజాగా కుందూజ్‌ ఇమామ్‌ సాహిబ్‌ జిల్లాలోని ఓ ప్రార్ధనా మందిరంలో బాంబు పేలింది. ఈ దాడిలో పిల్లలతో సహా 33 మంది మరణించారు. మరో 43 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి దాడులు ఎక్కువ‌గా.. ఐసిస్​ చేస్తుంది. ఈ దాడుల్లో కూడా ఐసిస్ పాత్రే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శుక్రవారం మరోసారి బాంబు పేలుళ్లతో ఆఫ్ఘనిస్థాన్ వణికిపోయింది. కుందుజ్ ప్రావిన్స్‌లోని ఇమామ్ సాహెబ్ పట్టణంలో ఈ ఘటన జరిగిందని జబీహుల్లా ముజాహిద్ ట్వీట్​ చేశారు. ఈ బాంబు దాడికి పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉంది. ఐసిస్​ పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గురువారం.. ఉత్తర మజర్ ఇ షరీఫ్​​లోని మసీదుపై దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ బాంబు పేలుడులో 10 మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదు.

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన కుందుజ్ ఇమామ్ సాహిబ్, కుందుజ్ జిల్లా పోలీసు చీఫ్ హఫీజ్ ఉమర్ టోలో న్యూస్‌తో మాట్లాడుతూ.. ఈ మధ్యాహ్నం మవ్లీ సికందర్ మసీదులో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. మసీదులో బాంబు పేలిందని తెలిపారు. ఆ సమయంలో కొందరు మసీదు లోపల నమాజ్ చేస్తున్నారు. అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో అక్కడికక్కడే భయాందోళనలు సృష్టించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ఇంకా ప్రకటించలేదు.

ఇదిలావుంటే, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్ ఎ షరీఫ్ నగరంలోని షియా మసీదులో గురువారం జరిగిన శక్తివంతమైన పేలుడులో కనీసం 10 మంది భక్తులు మరణించారు మరియు 40 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ పాలన స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, పేలుళ్లు, దాడులు దేశంలో నిత్యం జరుగుతున్నాయి. కాబూల్‌లో మరో సంఘటనతో పాటు ఇద్దరు చిన్నారులు అంతకుముందు రోజు గాయపడ్డారు.

Read Also… Delhi: రాజధానిలో ఘోరం.. మహిళను వెంటాడిన దుర్మార్గుడు.. పిల్లల ముందే కిరాతకంగా..