AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: బెజవాడలో రెచ్చిపోయిన లోకల్ లీడర్.. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యం..

బెజవాడలో లోకల్‌ లీడర్‌ రెచ్చిపోయాడు. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. తనను కాదని కాంట్రాక్ట్‌ ఎలా చేస్తారంటూ వీరంగం ఆడాడు చోటా లీడర్‌.

Vijayawada: బెజవాడలో రెచ్చిపోయిన లోకల్ లీడర్.. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యం..
Vijayawada Contractor Attack
Shiva Prajapati
|

Updated on: Oct 22, 2022 | 10:43 PM

Share

బెజవాడలో లోకల్‌ లీడర్‌ రెచ్చిపోయాడు. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. తనను కాదని కాంట్రాక్ట్‌ ఎలా చేస్తారంటూ వీరంగం ఆడాడు చోటా లీడర్‌. అవును, విజయవాడలో ఓ కాంట్రాక్టర్‌ రెచ్చిపోయాడు. తానుండగా మీరెలా కాంట్రాక్ట్‌ చేస్తారంటూ ఓ కంపెనీ సిబ్బంది రౌడీయిజానికి దిగాడు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో మరమ్మతు పనులు చేస్తోంది విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ. స్టేజ్‌-3లో బాయిలర్‌ రిపేర్‌ వర్క్‌ చేస్తోన్న ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగాడు లోకల్‌ లీడర్‌ అండ్ కాంట్రాక్టర్.

విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ వాహనంపై ఎటాక్‌ చేయడంతోపాటు గూండాగిరికి దిగాడు. దాంతో, ఉద్యోగులంతా భయాందోళనలకు గురయ్యారు. వాహనాన్ని అక్కడే వదిలేసి తలోవైపు పరుగులు తీశారు విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ సిబ్బంది. ఉద్యోగులు పారిపోవడంతో కంపెనీ వెహికల్‌ని ఎత్తుకెళ్లిపోయాడు కాంట్రాక్టర్‌. అనంతరం, ఆ కాంట్రాక్టర్‌పై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు బాధితులు. తమపై దాడిచేసి బెదిరించాడని ఫిర్యాదు చేశారు.

లోకల్‌గా తానుండగా, మీ కంపెనీ ఎలా ఇక్కడికొచ్చి పనులు చేస్తుందంటూ భయపెట్టాడని కంప్లైంట్‌లో తెలిపారు. విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ సిబ్బంది కంప్లైంట్‌తో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. దాడి చేసిన వ్యక్తి ఎవరనే తేల్చే పనిలో పడ్డారు. అయితే, ఈ ఇన్సిడెంట్‌, విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కలకలం రేపింది. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కంపెనీ సిబ్బందిపై దాడి చేయడమేంటని చర్చించుకుంటున్నారు ఉద్యోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం