Andhra Pradesh: కన్నా.. ఇకపై నేను రాను.. బాగా చదువుకోండి.. కన్నబిడ్డలతో తండ్రి చివరి మాటలు..

భార్య,భర్తలమధ్య వివాదాలు అభం శుభం తెలియని ఆ చిన్నారులను అనాధలను చేశాయి. దంపతుల మధ్య గొడవలతో విసిగిపోయిన భార్య క్షణికావేశంలో 15 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. మనోవేదనకు గురై ఆ భర్త కన్నబిడ్డలను...

Andhra Pradesh: కన్నా.. ఇకపై నేను రాను.. బాగా చదువుకోండి.. కన్నబిడ్డలతో తండ్రి చివరి మాటలు..
Father Death
Follow us

|

Updated on: Jan 03, 2023 | 11:22 AM

భార్య,భర్తలమధ్య వివాదాలు అభం శుభం తెలియని ఆ చిన్నారులను అనాధలను చేశాయి. దంపతుల మధ్య గొడవలతో విసిగిపోయిన భార్య క్షణికావేశంలో 15 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. మనోవేదనకు గురై ఆ భర్త కన్నబిడ్డలను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించి తానూ తనువుచాలించాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు గ్రామంలో కలమడి ప్రసాద్‌బాబు, సుకన్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఐశ్వర్య, అక్షిత, అరవింద్‌, అవినాష్‌ లు సంతానం. దంపతులు బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో సుకన్య తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి ప్రసాద్‌బాబు మనోవేదనకు గురయ్యాడు. తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను డిసెంబర్‌ 29న ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించాడు. తల్లి లేనందున తాను వారిని పోషించలేనని, మీరే చూసుకోవాలంటూ లేఖ రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకుని రాజంపేట బాలసదన్‌లో చేర్చారు.

కాగా.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తన బిడ్డలను చూసుకోడానికి ప్రసాద్‌బాబు వెళ్లాడు. కాసేపు వారితో హాయిగా గడిపాడు. ఆ సమయంలో ‘కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్‌ వాళ్లు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..’ అని చెప్పాడు. మర్నాడు జనవరి 2 ఉదయం రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను అప్పగించే ముందురోజునుంచే తాను చనిపోతానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తమను ప్రసాద్‌బాబు కోరినట్లు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కౌన్సెలింగ్‌ ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...