AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.

Andhra Pradesh: అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ..
Ysr Pension Kanuka
Shaik Madar Saheb
|

Updated on: Apr 04, 2024 | 9:27 AM

Share

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి దగ్గరే పింఛను అందిస్తున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుంటున్న పెన్షనర్లు క్యూలైన్లలో నిలబడి నగదు తీసుకుంటున్నారు. మొత్తం 13వేల 669 గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది..

ఏపీలో 66 లక్షల మందికిపైగా పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 40 శాతం మందికి సామాజిక పింఛన్లు అందించినట్టు అధికారులు చెప్తున్నారు. పెన్షనర్ల కోసం 19 వందల 51 కోట్ల నిధులను సిద్ధంగా ఉంచామని, ఎక్కడా నిధులకు ఇబ్బంది లేదని వివరిస్తున్నారు. 6వ తేదీ వరకూ సచివాలయాల్లో వృద్ధులకు పెన్షన్లు ఇస్తారు. ఇప్పటికే 26 లక్షలమందికిపైగా అవ్వాతాతలు పింఛన్ అందుకున్నారని చెప్తున్నారు.

నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 55 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యింది. విశాఖలో 52 శాతం మందికి పెన్షన్లు అందాయి. మిగతా చోట్ల కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. వారంటీర్లు ప్రస్తుతం విధుల్లో లేని కారణంగా.. చాలాచోట్ల వృద్ధులకు సరైన సమాచారం చేరక ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో.. వృద్ధుల కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ 7 గంటల నుంచే పెన్షన్‌ ఇస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..