Andhra Pradesh: కలకలం రేపుతున్న ఐదు నెలల చిన్నారి కిడ్నాప్.. నిద్రపోతున్న సమయంలో అపహరించిన దుండగులు..

కూలీ నాలీ చేసుకుంటే గానీ కడుపు నిండని కడు పేదలు. ఉండటానికి ఇల్లు కూడా లేక బస్టాండ్ లో తలదాచుకుంటున్నారు. దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది....

Andhra Pradesh: కలకలం రేపుతున్న ఐదు నెలల చిన్నారి కిడ్నాప్.. నిద్రపోతున్న సమయంలో అపహరించిన దుండగులు..
kidnap
Follow us

|

Updated on: Sep 14, 2022 | 12:25 PM

కూలీ నాలీ చేసుకుంటే గానీ కడుపు నిండని కడు పేదలు. ఉండటానికి ఇల్లు కూడా లేక బస్టాండ్ లో తలదాచుకుంటున్నారు. దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కంటికి రెప్పలా చిన్నారిని చూసుకుంటూ మురిసిపోయారు. కానీ వారి ఆనందం తొందరగానే ఆవిరైంది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా సేద తీరుతున్న శిశువును దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం నిద్రలేచాక చిన్నారి కనిపించకుండా పోవడాన్ని చూసి ఆ దంపతులు షాక్ అయ్యారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమ కుమారుడిని తీసుకురావాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐదు నెలల శిశువు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. బంటుమిల్లిలో ఐదు నెలల శిశువు కనిపించకుండాపోయింది. దీంతో శిశువు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

బంటుమిల్లి బస్టాండ్ లో పది సంవత్సరాలుగా మల్లా చిలకయ్య, వెంకటేశ్వరమ్మ దంపతులు తలదాచుకుంటున్నారు. ఐదు నెలల క్రితం వెంకటేశ్వరమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బిడ్డతో కలిసి సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును అపహరించారు. ఉదయం లేచి చూసుకున్న దంపతులకు తమ కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా జాడ కనిపించకపోవడంతో కన్నీటిపర్యంతమవుతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శిశువును అపహరించిన దుండగుల కోసం సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు