AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దారుణం.. పుస్తకంలో పేజీ చింపినందుకు తల పగలగొట్టారు..

గుడివాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుస్తకంలో పేజీ చింపినందుకు విద్యార్థిపై తోటి విద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. రైటింగ్ ప్యాడ్‌తో స్నేహితుడి తల పగలగొట్టాడు 8వ తరగతి విద్యార్థి. అయితే, ఓవైపు టీచర్ పాఠాలు చెప్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.

Andhra Pradesh: దారుణం.. పుస్తకంలో పేజీ చింపినందుకు తల పగలగొట్టారు..
School Students
Shiva Prajapati
|

Updated on: Mar 25, 2023 | 9:13 PM

Share

గుడివాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుస్తకంలో పేజీ చింపినందుకు విద్యార్థిపై తోటి విద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. రైటింగ్ ప్యాడ్‌తో స్నేహితుడి తల పగలగొట్టాడు 8వ తరగతి విద్యార్థి. అయితే, ఓవైపు టీచర్ పాఠాలు చెప్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియా స్కూల్‌లో మణికంఠ, దుర్గాప్రసాద్ 8వ తరగతి చదువుతున్నారు. అయితే, క్లాస్‌లో టీచర్ పాఠాలు చెబుతుండగా దుర్గాప్రసాద్ పుస్తకం తీసుకున్నాడు మణికంఠ. అయితే, పొరాపాటుగా పుస్తకంలో పేజీ చినిగిపోయింది. అది చూసిన దుర్గాప్రసాద్ ఆగ్రహంతో రైటింగ్ తీసుకుని మణికంఠ తలపై బలంగా కొట్టాడు.

దాంతో మణికంఠ తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు చికిత్స అందించారు. మణికంఠకు ఆరు కుట్లు పడ్డాయి. అయితే, మణికంఠ తకు గాయమైనా పాఠశాల యాజమాన్యం స్పందించలేదంటూ అతని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడి ప్రాణం మీదకు వస్తే బాధ్యులెవరు? అని ప్రశ్నిస్తున్నారు. టీచర్ పాఠాలు చెప్తుండగానే ఈ ఘటన జరగడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మణికంఠ తల్లిదండ్రులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..