AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నర్సీపట్నంలో విషాదం.. ఇంట్లో మంటలు చెలరేగి తండ్రి, కొడుకు మృతి.. తల్లీ, కూతురికి..

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణాబజార్ సెంటర్లో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదంతో తండ్రి కొడుకులు మృతి చెందారు. తల్లీ, కూతురు ఆసుపత్రి పాలయ్యారు.

Andhra Pradesh: నర్సీపట్నంలో విషాదం.. ఇంట్లో మంటలు చెలరేగి తండ్రి, కొడుకు మృతి.. తల్లీ, కూతురికి..
Fire Accident
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2022 | 8:37 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణాబజార్ సెంటర్లో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదంతో తండ్రి కొడుకులు మృతి చెందారు. తల్లీ, కూతురు ఆసుపత్రి పాలయ్యారు. నర్సీపట్నానికి చెందిన మల్లేశ్వరరావు అంబికా జ్యూయలర్స్‌ నిర్వహిస్తున్నారు. జ్యూవెల్లర్స్ షాపు పైనే కుటుంబంతో నివాసముంటున్నారు. అంబికా జ్యూయలరీ షాపు మేడపైన అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే షాపు యాజమాని మల్లేశ్వరరావు.. తన సోదరుడుకి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. సోదరుడు షాపు దగ్గరకు చేరేసేరికి దట్టంగా పొగలు అలుముకున్నాయి.

అప్పటికే మంటల పొగతో తీవ్రంగా వ్యాపించింది. ఈ క్రమంలో ఊపిరాడక మల్లేశ్వరరావు, ఆయన కొడుకు మౌలేష్ ప్రాణాలు కోల్పోయారు. భార్యతో పాటు కుమార్తెలకు గాయాలు కావడంతో హుటాహుటిన విశాఖ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ప్రమాదానికి ప్రాథమికంగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన తల్లీకూతుళ్లకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..