Andhra Pradesh: జయహో కేసీఆర్.. విజయవాడలోనూ BRS ఫ్లెక్సీలు.. భారీ బహిరంగ సభకు నేతల ప్లాన్..!

దేశ రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని.. జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: జయహో కేసీఆర్.. విజయవాడలోనూ BRS ఫ్లెక్సీలు.. భారీ బహిరంగ సభకు నేతల ప్లాన్..!
Cm Kcr Brs Party
Follow us

|

Updated on: Oct 05, 2022 | 5:08 PM

దేశ రాజకీయాల్లో మరో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాంది పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని.. జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితి పేరు మారింది. దసరా పర్వదినం రోజున జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంతోపాటు.. సీఎం కేసీఆర్ పార్టీ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర పోస్టర్లు, హోర్డింగులు అన్ని ప్రాంతాల్లో వెలుస్తున్నాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనూ భారత్ రాష్ట్ర సమితి హోర్డింగులు వెలిశాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న జయహో కేసీఆర్ అంటూ హోర్డింగ్‌పై.. కీసీఆర్, కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కాగా.. ఏపీలోనూ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉంటే.. ఏపీలో కూడా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో సంక్రాంతికి భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. BRSకు అక్కడ కూడా మంచి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీ నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి సైతం చెప్పడం మరింత ఆసక్తికరకరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?