AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan on corona: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష.. కీల‌క ఆదేశాలు

AP CM Jagan: కొవిడ్‌ ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఈ స‌మావేశంలో సీం అధికారుల‌కు సూచించారు.

CM Jagan on corona: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష.. కీల‌క ఆదేశాలు
Cm Jagan Review On Corona
Ram Naramaneni
|

Updated on: May 10, 2021 | 3:39 PM

Share

కొవిడ్‌ ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఈ స‌మావేశంలో సీం అధికారుల‌కు సూచించారు. అధికారులు నిత్యం మాక్‌ కాల్స్‌ చేసి పనితీరు పర్యవేక్షించాలని ఆదేశించారు. రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్స్ సంఖ్య‌ను బాగా పెంచాలన్నారు. 104కు కాల్ చేస్తే జాప్యం ఉండ‌కుండా.. త్వ‌రిత‌గ‌తిన‌ స్పందించాలని పేర్కొన్నారు. బెడ్‌ అవసరం లేదంటే కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపించాలని.. 104కు కాల్‌ చేసే కొవిడ్‌ బాధితులకు కచ్చితంగా సాయం అందాలని సీఎం జగన్​ సూచించారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య మిత్ర ఉండాలన్నారు.

వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద, రద్దీ, తోపులాట కనిపించకూడదని సీఎం అధికారులకు ఆదేశించారు. నెలకు 19 లక్షలకు పైగా డోసులే వస్తున్నాయని.. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్‌ వెళ్లడంపై ఆలోచించాలని ముఖ్య‌మంత్రి అన్నారు. గ్లోబల్ టెండర్‌పై ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంద‌ని సీఎం చెప్పారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అదికూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ ఎవరికి వేస్తారనేది ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చెప్పాలని స్పష్టం చేశారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్‌ అందేలా చూడాలని సూచించారు. పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బ్లాక్ మ‌ర్కెట్ లో అమ్మ‌కుండా చూడాలన్నారు. రెమ్‌డెసివిర్‌ వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆడిటింగ్‌ ఉండాలని సీఎం పేర్కొ న్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం సూచించారు.

Also Read: క‌రోనా బారిన‌ప‌డ్డ జూనియ‌ర్ ఎన్టీఆర్.. స్వ‌యంగా ట్వీట్.. ప్ర‌స్తుతం ఎలా ఉందంటే

 తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..