AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అమ్మో..! చిల్లర నాణేలతో ఏకంగా రూ. 1.30 లక్షల బైక్ కొన్నాడు.. వీడియో చూస్తే.!

చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్‌కు వచ్చిన ఓ అర్చకుడు.. తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి.. ఆ షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు. తాను ఇప్పటివరకు కూడబెట్టిన సొమ్ముతో బైక్ కొనేందుకు సిద్ధమైన అర్చకుడు.. తన కల సాకారం చేసుకున్నాడు.

AP News: అమ్మో..! చిల్లర నాణేలతో ఏకంగా రూ. 1.30 లక్షల బైక్ కొన్నాడు.. వీడియో చూస్తే.!
Bike Brought With Coins
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 22, 2024 | 12:01 PM

Share

చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్‌కు వచ్చిన ఓ అర్చకుడు.. తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి.. ఆ షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు. తాను ఇప్పటివరకు కూడబెట్టిన సొమ్ముతో బైక్ కొనేందుకు సిద్ధమైన అర్చకుడు.. తన కల సాకారం చేసుకున్నాడు. పలమనేరులోని టీవీఎస్ మోటార్ బైక్ షోరూంకు చిల్లర నాణేల సంచులతో చేరుకున్న బైరెడ్డిపల్లికి చెందిన అర్చకుడు అక్కడి సిబ్బంది ముక్కుపై వేలు వేసుకునేలా చేశాడు. బైక్ కొనుగోలు కోసం వచ్చిన అర్చక దంపతులు మురళీధరాచార్యులు, ఉష షోరూమ్ అంతటా తిరిగి.. అందుబాటులో ఉన్న అన్ని మోడల్స్ చూశారు. అర్చకుడు తన వెంట డబ్బుగా.. చిల్లర నాణేలను తీసుకొచ్చిన సంగతి తెలియని షోరూమ్ సిబ్బంది.. అతడికి తమ వద్ద ఉన్న అన్ని వాహనాలను చూపించారు. అన్ని మోడల్స్ చూసిన అనంతరం.. ఎట్టకేలకు టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తానని.. తన పేరు మీద బిల్లింగ్ చేయాలని కోరాడు.

దీంతో అర్చకుడి పేరుపై బిల్లు ప్రిపేర్ చేసిన షోరూమ్ సిబ్బంది.. జుపిటర్‌కు రూ. 1.30 లక్షలు చెల్లించాలని తెలిపారు. ఇక వారికి షాకిస్తూ తన దగ్గర ఉన్న చిల్లర నాణేల సంచులను రాశులుగా పోశాడు పురోహితుడు. దీంతో షోరూమ్ సిబ్బందికి దిమ్మతిరిగిపోయింది. అంత మొత్తంలో చిల్లర నాణేలను చూసి అవాక్కైన షోరూం యజమాని ఒకింత షాక్‌కు గురైనా.. చేసేదేమిలేక చిల్లర లెక్కింపునకు సిద్దమయ్యారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చిల్లర లెక్కించారు. మొదట షోరూమ్ సిబ్బంది చిల్లర నాణేలను లెక్కించేందుకు చిరాకుపడ్డా.. ఈ వింతైన అనుభవంతో చివరికి చిరునవ్వుతో బైక్‌ను అర్చక దంపతులకు అప్పగించారు షోరూమ్ నిర్వాహకులు.

బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లె కాలభైరవ స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మురళీధరాచార్యులు.. మూడేళ్లుగా భక్తుల కానుకలను కూడబెట్టి ఈ బైక్ కొన్నాడు. అర్చకుడి బైక్ కొనాలన్న కోరిక నెరవేరగా.. షోరూమ్ యజమాని అతడి చేత కేక్ కట్ చేయించి.. స్కూటర్‌ను అప్పగించారు.

వీడియో 1:

వీడియో 2: