AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: పొలం నుంచి తిరిగొస్తుండగా రైతును చంపిన ఏనుగు.. విద్యుత్ షాక్‌తో మరో..

చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతాంగానికి ఏనుగుల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లిలో రైతు దంపతులపై దాడి చేసిన ఏనుగు ఒకర్ని బలి తీసుకుంది. మృతి చెందిన రైతు మార్కండేయగా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది. పొలం పనులు ముగించుకొని భార్య అరుణతో కలిసి ఇంటికి వెళుతుండగా ఓ ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడి చేసిన సమయంలో భార్య అరుణ తప్పించుకోగా ఏనుగు దాడిలో భర్త మార్కండేయ మృతి చెందాడు. ఏనుగు దాడి సమాచారం..

Chittoor: పొలం నుంచి తిరిగొస్తుండగా రైతును చంపిన ఏనుగు.. విద్యుత్ షాక్‌తో మరో..
Elephant Attacked On Farmer
Raju M P R
| Edited By: |

Updated on: Aug 20, 2023 | 3:25 PM

Share

చిత్తూరు, ఆగస్టు 20: ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఆ జిల్లా రైతులకు గగనంగా మారింది. ఏనుగుల వరుస దాడుల్లో పంటను కాపాడుకునే క్రమంలో కొందరు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. తాజాగా మరో రైతు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఓ ఎనుగు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మరో ఘటనలో విద్యుత్ షాక్‌కు గురై మరో ఎనుగు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత రైతాంగానికి ఏనుగుల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పెద్దపంజాణి మండలం ముదిరెడ్డిపల్లిలో రైతు దంపతులపై దాడి చేసిన ఏనుగు ఒకర్ని బలి తీసుకుంది. మృతి చెందిన రైతు మార్కండేయగా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది. పొలం పనులు ముగించుకొని భార్య అరుణతో కలిసి ఇంటికి వెళుతుండగా ఓ ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడి చేసిన సమయంలో భార్య అరుణ తప్పించుకోగా ఏనుగు దాడిలో భర్త మార్కండేయ మృతి చెందాడు. ఏనుగు దాడి సమాచారం గ్రామస్తులు అడవిశాఖ సిబ్బందికి ఇచ్చారు. గతంలో ఇదే చోట ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందడం విశేషం. మార్కండేయ మృతితో ఆ సంఖ్య మూడుకు చేరింది.

మరో ఘటనలో.. విద్యుత్ షాక్‌కు గురై మరో ఏనుగు మృతి

మరో ఏనుగు బైరెడ్డిపల్లి మండలం నల్లగుంట్లపల్లె లో విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. పంట పొలాలల్లోని విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టిన ఏనుగు విద్యుత్ షాక్ కు గురయింది. విద్యుత్ స్తంభం విరిగిపడడంతో విద్యుత్ తీగలు ఏనుగును తాకి విద్యుత్ షాక్ కు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కౌండిన్య అభరణ్యం నుంచి బయటకు వస్తున్న ఏనుగులు తరచూ ప్రమాదాలకు గురై మృతి చెందడంతో అటవీ శాఖ ఆందోళన చెందుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!