Kurnool district: ఒకేసారి తల్లి కొడుకుల్ని కాటేసిన పాము.. పాపం పసివాడు!
కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాముకాటేసింది.
కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాముకాటేసింది. కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా పాముకాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతువాతపడ్డాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని పేట్నికోటలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కొలిమిగుండ్ల మండలం పేట్నికోటకు చెందిన ఓబులమ్మ అనే మహిళ తన మూడేళ్ల కుమారుడు సాత్విక్తో ఇంటిముందు వాకిట్లో ఉన్నారు. బాలుడు ఆడుకుంటుండగా, ఓబులమ్మ ఇంట్లోకి వెళ్లింది. అలా వెళ్లి రెండు నిమిషాలు గడవకముందే..బాలుడు గట్టిగా అరిచాడు. ఏం జరిగిందోనని వచ్చి చూసేసరికి..బాలుడి ముందు..ఓ పెద్ద విష సర్పం కనిపించింది. అది అప్పటికే ఆ బాలుడిని కాటేసింది. కొడుకు కాపాడుకోవాలనే ఆరాటంతో.. అక్కడికి వెళ్లిన ఓబులమ్మను కూడా పాము కాటేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై..ఇరువురిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో కుమారుడు సాత్విక్ మృతిచెందాడు. తల్లి ఓబుల్లమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృత్యువాతపడగా, తల్లి ఓబులమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో పెట్నీకోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: మత్తెక్కిస్తున్న ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా’ సాంగ్.. యూట్యూబ్లో సెన్సేషన్
Andhra Pradesh: రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు