AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 28న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి-టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ..

ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..
Job Mela In Vijayawada
M Sivakumar
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 27, 2023 | 8:11 AM

Share

Vijayawada: నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎపిఎస్ఎస్ఓసి అధికారి పి.నరేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి-టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, bit.ly/43biyyaలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేసారు.

కాగా, జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన పది కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులకు ఇంటర్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. వివరాలకు 19347779032, 9700092606, 9603368324 నెంబర్లలో సంప్రదించాలని ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..