Krishna Water Dispute: తారాస్థాయికి కృష్ణా జలాల వివాదం.. తెలంగాణను కట్టడి చేయాలంటూ ఏపీ లేఖ

AP - KRMB: కృష్ణా జలాల వాడకం విషయంలో తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వాడకం విషయంలో

Krishna Water Dispute: తారాస్థాయికి కృష్ణా జలాల వివాదం.. తెలంగాణను కట్టడి చేయాలంటూ ఏపీ లేఖ
Krmb
Follow us

|

Updated on: Apr 05, 2022 | 12:38 PM

AP – KRMB: కృష్ణా జలాల వాడకం విషయంలో తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ (Telangana) ప్రభుత్వాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. నదీ జలాల వాటా విషయంలో వివాదం రెండు రాష్ట్రాల మధ్య తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తాజాగా కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం – కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడం మరో వివాదంగా మారనుంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌ జలాలను తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ ఛీప్‌ సి.నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. గతేడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే నాగార్జున సాగర్‌ నుంచి నీటిని తరచూ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించడం వలన పులిచింతల ప్రాజెక్టులో స్పిల్‌ వే రేడియల్‌ గేట్లను తెరవడం, మూయడం చేయాల్సి వచ్చిందని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఈ కారణంగా స్పిల్‌ వే గేట్‌ నెంబర్ 16 కొట్టుకుపోయిందని తెలిపారు. ఆ గేటును ఇప్పటికీ అమర్చలేదని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం నీటిని విడుదల చేస్తూ పోతే పులిచింతల రిజర్వాయర్‌ పూర్తి స్థాయి మట్టానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికంగా వచ్చే నీటిని ప్రకాశం బ్యారెజీకి విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తుందని ENC తన లేఖలో రాశారు. ఇప్పటికే ప్రకాశం బ్యారెజ్‌ నిండుగా ఉందని, ఎగువ నుంచి వచ్చే నీరు సముద్రం పాలవుతుందని అన్నారు.

అంతే కాదు, ఈ వేసవిలో నాగార్జున సాగర్‌ పరిధిలో తాగునీటి కోసం తీవ్రమైన డిమాండ్‌ ఉంటుందని, ఈ కారణంగా అమూల్యమైన నీటిని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. అటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి – కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ కానున్నారు. ఆయనతో సమావేశం సందర్భంగా నదీ జలాల విషయం ప్రస్తావనకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read:

AP Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. కాబోయే కొత్త మంత్రులు వీరే..? లిస్ట్ వైరల్..!

AP New Districts: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు