AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని వారందరికి గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ!

రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇకపై వారు ఫించన్ కోసం ఇంటి వద్దకే వెళ్లకుండా వారు కోరుకున్న వద్దనే ఫించన్‌ను పొందవచ్చు. విద్యార్థుల కోరిక మేరకే ఇంటి వద్ద లేదా గురుకులాల్లో, బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది.

ఏపీలోని వారందరికి గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ!
New Flexible Pension Disbursement System Launched In Ap
Anand T
|

Updated on: Aug 23, 2026 | 7:32 PM

Share

దివ్యాంగ విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతి నెల ఫించన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫించన్ల పంపిణీ విషయంలో ఏపీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల ఇంటి వద్ద లేదా గురుకులాల్లో ఎక్కడైనా వారి నిర్ణయం మేరకే అందించాలని డిసైడ్ అయ్యింది. అంతేకాదు వారి కోరిక మేరకు బ్యాంక్ అకౌంట్‌లో కూడా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో అక్టోబర్ నెల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం.. పింఛన్ డబ్బులను గురుకులాల సమీపంలోని స్వర్ణ సచివాలయానికి మ్యాప్ చేసి అక్కడి నుంచి పాఠశాలలోని విద్యార్థులకు అందజేస్తారు. అలాగే కావాలి అనుకునే వారికి అకౌంట్లలో జమ చేస్తారు. అయితే అంధ విద్యార్థులో కొంత మంది పించన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

దీంతో ఈ సమస్యపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు వారికి కోరిక మేరకే పింఛన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని 424 మంది దివ్యాంగ విద్యార్థుల్లో ఫించన్ డబ్బులను 116 మంది బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని కోరగా.. 17 మంది గురుకులాల్లో, 178 మంది ప్రస్తుతం పంపిణీ విధానంలోనే అందజేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే అక్టోబర్ నుంచి విద్యార్థుల కోరిక మేరకే అధికారులు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us