Anakapalle: కాపురానికి రమ్మని పిలిచి.. భర్తపై సలసల కాగే వేడి నూనె పోసిన భార్య
కాపురానికి రమ్మని పిలిచి.. ఉన్నఫలంగా వేడి నూనెతో అటాక్ చేసింది భార్య. వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త పై సలసల కాగే వేడి నూనె పోసింది భార్య. కొన్నాళ్లుగా గొడవల కారణంగా దంపతులు వేరువేరుగా ఉంటున్నారు. తాజాగా కాపురానికి రమ్మన్నందుకు పిలిచి.. పక్కా ప్లాన్ ప్రకారం వేడి నూనెతో అటాక్ చేసింది. చోడవరం మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. భర్త ఈశ్వరరావుకు గాయాలవ్వడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
భార్య మరణించడంతో విజయను రెండో వివాహం చేసుకున్నాడు ఈశ్వరరావు. ఆస్తి పంపకల్లో వివాదం నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది విజయ. తాజాగా కాపురానికి రమ్మని పిలిచి.. కథం చేయాలని స్కెచ్ వేసింది. ప్రస్తుతం ఈశ్వరరావు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..