AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని..

ఈ మధ్యకాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు మరింత ఆందోళనకరంగా మారాయి. చదువుల ఒత్తిడి చిత్తు చేయడమే అందుకు కారణం. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న లేత కుసుమాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా్యి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి మరణం కలకలంగా మారింది. విద్యార్ధి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని..

IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని..
Sudent Gangaram
Srilakshmi C
|

Updated on: Sep 20, 2023 | 6:57 AM

Share

వేంపల్లె, సెప్టెంబర్‌ 20: ఈ మధ్యకాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు మరింత ఆందోళనకరంగా మారాయి. చదువుల ఒత్తిడి చిత్తు చేయడమే అందుకు కారణం. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న లేత కుసుమాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా్యి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి మరణం కలకలంగా మారింది. విద్యార్ధి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీలైన తల్లిదండ్రులు ఎండలో చాకిరీ చేసి కుమారుడిని పెద్ద చదువులు చదివిస్తూ మురిసిపోయారు. కానీ చేతికందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో గుండెలవిసేలా విలపిస్తున్నారు. పోలీసులు, తోటి విద్యార్థుల కథనం ప్రకారం..

లింగాల మండలం తేర్నాంపల్లె హరిజనవాడకు చెందిన నారాయణమ్మ, గంగాధర అనే దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గంగారాం, చిన్న కుమారుడు గౌరీకుమార్‌లు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ నారాయణమ్మ, గంగాధర దంపతులు కుమారులను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు గంగారాం (21) వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ గంగారాం ట్రిపుల్‌ ఐటీలోని తన హాస్టల్‌ గదిలో మంగళవారం (సెప్టెంబర్‌ 19) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు.

హాస్టల్‌లోని తోటి విద్యార్థులు గంగారాం గది తలుపులు కొట్టినా ఎంతకూ తీయలేదు. దీంతో విద్యార్ధులు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం విద్యార్ధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ గోవిందరెడ్డితోపాటు తదితరులు ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్ధి గదిలో ఎటువంటి సూసైడ్‌ లెటర్‌ లభ్యంకాలేదని.. కేసు దర్యాప్తులో ఉందని మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..