Andhra Pradesh: 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తాం.. సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం

విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌, ఆరోగ్యశ్రీ పై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి (Tadeapalli) లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై....

Andhra Pradesh: 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తాం.. సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం
Follow us

|

Updated on: Jun 28, 2022 | 8:00 PM

విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌, ఆరోగ్యశ్రీ పై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి (Tadeapalli) లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై చర్చలు జరిపారు .తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటుపై కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై చర్చించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ లో పొరపాట్లు, అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హత కలిగిన వారందరికీ ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. ఈ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆసుపత్రికి నగదు బదిలీ చేయాలని పేర్కొన్నారు.

సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తాం. ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలి. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులిటీని దృష్టిలో ఉంచుకోవాలి. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలి. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలి. తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 2,436 చికిత్సల సంఖ్య ఇంకా పెంచాలి. ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఖాళీల కొరత ఉండకూడదు. అవసరమైతే సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచేందుకు ఆలోచించాలి. త్వరలో 176 పీహెచ్‌సీలు పూర్తి చేసి 2,072 పోస్టులు భర్తీ చేస్తాం.

              – సీఎం వైఎస్.జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..