AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భార్యను దారుణంగా చంపి.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. మృతుని వద్ద లభించిన డైరీ ఆధారంగా

దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సాధారణమే. అలా అని వాటిని తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించుకోకుండా పెద్దవి చేసుకుంటున్నారు. చేజేతులా నిండు జీవితాలను....

Hyderabad: భార్యను దారుణంగా చంపి.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. మృతుని వద్ద లభించిన డైరీ ఆధారంగా
Crime
Ganesh Mudavath
|

Updated on: Jun 28, 2022 | 6:48 PM

Share

దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సాధారణమే. అలా అని వాటిని తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించుకోకుండా పెద్దవి చేసుకుంటున్నారు. చేజేతులా నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దంపతుల మధ్య జరిగిన ఘర్షణతో భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. భార్య తలను నీటిలో ముంచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగింది. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్‌, పంప సర్కార్‌ దంపతులు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్రేమ్‌నగర్‌ కు వచ్చారు. అక్కడే నివాసముంటూ ఓ మాల్ లో దంపతులిద్దరూ సెక్యూరిటీ గార్డ్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. సోమవారం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త మహానంద.. తన భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో తలవరకు ముంచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతదేహాన్ని గమనించిన రైల్వే పోలీసులు.. బిశ్వాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా అతని వద్ద కీలక సమాచారం బయటపడింది. చిన్న డైరీలో తన భార్యను చంపినట్లు రాసుకున్నాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించాడు. వెంటనే నాంపల్లి రైల్వే పోలీసులు అప్రమత్తమై పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమ్‌నగర్‌లోని మృతుడి నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. ఇంట్లో ఉన్న పంప సర్కార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..