Andhra Pradesh: ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.. బద్వేలులో ప్లాంట్‌.. 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ...

Andhra Pradesh: ఏపీలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ.. బద్వేలులో ప్లాంట్‌.. 9 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
Century Plyboards Investmen
Follow us

|

Updated on: Aug 26, 2021 | 10:58 AM

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా… ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికలను సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించి చర్చించారు. రైతులతో యూకలిప్టస్‌ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్లపై గిట్టుబాటు ధర కల్పన, ఆర్థికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. సెంచరీ ప్లై బోర్డ్స్‌ ఇండియా కంపెనీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటికే యూనిట్‌లు ఏర్పాటుచేసింది.

ఏపీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం, 3 వేల మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6 వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ప్లాంట్‌ 2024 డిసెంబర్‌ వరకు మూడు దశల్లో పూర్తి కానుంది. ఏడాదికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి మూడు దశలు పూర్తయ్యే సరికి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల పూర్తి స్థాయి సామర్ధ్యంతో ప్లాంట్‌ సిద్ధం కానుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవన్‌ ఉన్నారు.

Also Read: ఉపశమనం..! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

AP Schools: స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ.. అయోమయ స్థితిలో పేరెంట్స్

Latest Articles
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు