AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet: రేపు ఏపీ రాష్ట్ర మంత్రి మండలి భేటీ.. కరోనా తీవ్రత, కర్ఫ్యూ విధింపుపై కీలక చర్చ!

ఏపీలో నిత్యం 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

AP Cabinet: రేపు ఏపీ రాష్ట్ర మంత్రి మండలి భేటీ.. కరోనా తీవ్రత, కర్ఫ్యూ విధింపుపై కీలక చర్చ!
Balaraju Goud
|

Updated on: May 03, 2021 | 8:34 PM

Share

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క‌రోనా వికృతరూపం ప్రదర్శిస్తోంది. నిత్యం 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ స‌మావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 4వ తేదీన ఉద‌యం రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్యక్షత‌న జ‌ర‌గ‌నున్న ఏపీ కేబినెట్ స‌మావేశంలో.. క‌రోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్చలపైనే ప్రధానంగా చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బుధవారం నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధింపును కేబినెట్‌ ఆమోదించనుంది.

ఏపీలో కరోనా కేసులు పెరుగుతండటంతో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5 నుంచి పగటిపూట పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి 12వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని పేర్కొంది. ఆ సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

అలాగే, రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొర‌త వెంటాడుతుండ‌గా.. వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంపై కూడా దృష్టిసారించ‌నుంది రాష్ట్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో పెరుగుతున్న క‌రోనా రోగుల‌కు అందుతున్న వైద్య స‌దుపాయాల‌పై చ‌ర్చించ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఆక్సిజ‌న్, బెడ్లు, రెమిడెసివిర్ కొర‌త వంటి అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశాలున్నాయి. వీటితో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలూ చర్చకు రానున్నాయి.

Read Also….  AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత… 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?