AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత… 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత... 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి
Andhra Pradesh Corona Updates
Balaraju Goud
|

Updated on: May 03, 2021 | 8:02 PM

Share

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులతో పాటు కరోనా మరణాలు కూడా అంతే స్థాయిలో రికార్డు అవుతుండటంతో జనం బెంబెలేత్తుతున్నారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనా మహమ్మారి ధాటికి మరో 71 మంది ప్రాణాలను కోల్పోయారు.

ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,275 కరోనా పరీక్షలు చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ ఏపీలో 11,63,994 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయలో 1,51,852 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక, ఇవాళ కరోనాతో మరణించిన వారిలో విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది.. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతిచెందారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులు హెచ్చరించారు.

ఇక జిల్లాల వారీగా కరోనా కేసులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…..

Ap Coronavirus

Ap Coronavirus

Read Also…. Siddartha Chowdary: ఉక్కు మనిషిని సైతం పిండి చేస్తున్న కరోనా.. తాజాగా మరో బాడీబిల్డర్ సిద్దార్ధ్ చౌదరి కోవిడ్‌తో మృతి