AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఫార్మా కంపెనీ ప్రమాదం.. వైజాగ్ వెళ్లనున్న సీఎం జగన్..!

విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్‌ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ ను అడిగి ఆయన తెలుసుకున్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. గం.11.45ని.లకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి.. బాధితులను పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల్లో ఆరేళ్ల శ్రియ, 40ఏళ్ల అప్పల నర్సమ్మ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా వెంకటాపురానికి చెందినవారే. మరోవైపు […]

Breaking: ఫార్మా కంపెనీ ప్రమాదం.. వైజాగ్ వెళ్లనున్న సీఎం జగన్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2020 | 9:09 AM

Share

విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్‌ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ ను అడిగి ఆయన తెలుసుకున్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. గం.11.45ని.లకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి.. బాధితులను పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల్లో ఆరేళ్ల శ్రియ, 40ఏళ్ల అప్పల నర్సమ్మ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా వెంకటాపురానికి చెందినవారే.

మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనతో కేజీహెచ్‌కు బాధితుల తాకిడి పెరిగింది. దీంతో రోధనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. డాక్టర్లు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. దీనిపై కేజీహెచ్‌ సూపరెంటెండెంట్ అర్జున మాట్లాడుతూ.. స్టెరీన్‌ గ్యాస్‌ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపింది. ప్రస్తుతం 100కు పైగా పడకలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇక గ్యాస్‌ లీకేజీ తరువాత ఇళ్లలో నుంచి అందరూ బయటకు పరిగెత్తడంతో.. చాలా మంది తమ కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో చాలా మూగ జీవాలు కూడా మృత్యువాతపడ్డాయి.

Read This Story Also: మొన్న వచ్చింది ‘కిమ్’ కాదా..! ‘డూప్‌’నా..!