మొన్న వచ్చింది ‘కిమ్’ కాదా..! ‘డూప్’నా..!
ఇటీవల కాలంలో కరోనా తరువాత బాగా వినిపించిన మరో పేరు కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు ఏమైంది..? కిమ్ మరణించాడా..? కిమ్కు శస్త్ర చికిత్స బెడిసి కొట్టిందా..?
ఇటీవల కాలంలో కరోనా తరువాత బాగా వినిపించిన మరో పేరు కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు ఏమైంది..? కిమ్ మరణించాడా..? కిమ్కు శస్త్ర చికిత్స బెడిసి కొట్టిందా..? ఇలా పలు రకాల పుకార్లు వినిపించాయి. అయితే గత శుక్రవారం జరిగిన ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కు వచ్చేసిన కిమ్ తనపై వచ్చిన అన్ని వార్తలకు చెక్ పెట్టేశాడు. అసలు తనకు ఏమీ కానట్లు ఎప్పటిలాగే నవ్వుతూ అందరికీ దర్శనమిచ్చాడు. దీంతో కిమ్ బతికే ఉన్నాడన్న కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మొన్న వచ్చింది కిమ్ కాదని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కిమ్కు సంబంధించి అంతకుముందు, ఇప్పుడు ఫొటోలను చూపిస్తోన్న చాలా మంది.. తేడాలను చెప్తున్నారు. కిమ్ కళ్లు, పళ్లు, దవడలను చూపిస్తూ.. వచ్చింది కిమ్ కాదని, అతడి డూప్ అని చెప్తున్నారు. ఇక ప్రముఖ డెయిలీ మెయిల్ వెబ్సైట్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. కిమ్ జాంగ్ ఉన్ తన బాడీని డబుల్గా వినియోగించాడని అందులో ప్రచురించింది. దీంతో కిమ్పై అందరిలో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. కాగా కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ విషయంలోనూ అప్పట్లో ఇలాంటి వార్తలే రావడం గమనర్హం.
Read This Story Also: సోషల్ మీడియాలో ‘బాయిస్ లాకర్ రూమ్’ బీభత్సం.. అడ్మిన్ అరెస్ట్..!
https://twitter.com/LouiseMensch/status/1256442712146001922?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1256442712146001922&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Finternational%2Fkim-jong-un-using-body-double-after-making-public-appearance-since-death-rumours-reports-ba-510798.html