APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఏసీ బస్సుల ఛార్జీల తగ్గింపు.. ఎంతమేరనంటే?

Andhra Pradesh: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీల్లో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఏసీ బస్సుల ఛార్జీల తగ్గింపు.. ఎంతమేరనంటే?
Apsrtc
Follow us

|

Updated on: Sep 02, 2022 | 7:39 PM

Andhra Pradesh: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సు ఛార్జీల్లో 20శాతం వరకు తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల తగ్గింపు ఈనెల 30వరకు అమల్లో ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. రూట్లు, ఛార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌(RM)లకు అప్పగించింది. ఈనేపథ్యంలో ఛార్జీల తగ్గింపుపై ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.

తగ్గించిన ఛార్జీల వివరాలివే..

  • విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్‌ ధరల్లో 10 శాతం మేర తగ్గించారు.
  • విజయవాడ-విశాఖ డాల్ఫిన్‌ క్రూజ్‌ , విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు వెళ్లే ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించారు.
  • శుక్రవారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఛార్జీల తగ్గింపు అమల్లో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ సూచించింది.

0

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..