AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్‌ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?

అల్లూరి జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం సృష్టించింది. కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్‌ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అనుమానాస్పదస్థితిలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఆ డెడ్‌బాడీ తన పిల్లాడిది కాదని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులకు కొత్త సమస్య వచ్చిపడింది.

తప్పిపోయిన విద్యార్థి.. అనుమానాస్పదస్థితిలో మృతదేహం.. విద్యార్థి మనోజ్‌ కాకుంటే.. డెడ్‌బాడీ ఎవరిది?
Student Missing
Maqdood Husain Khaja
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 24, 2024 | 1:56 PM

Share

అల్లూరి జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. మంప- కొయ్యూరు సమీపంలో అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యమవడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆ తర్వాత.. మృతదేహం మనోజ్ దేనంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ మృతదేహం తమ బిడ్డది కాదని తల్లిదండ్రులు, బంధువులు చెప్తుండడం సంచలనంగా మారింది.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్‌.. వారం రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే.. మనోజ్‌ మృతి చెందినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్‌, వార్డెన్‌, పోలీసుల తీరుపై ఫైర్‌ అవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో డెడ్‌బాడీ తమ బాబుది కాదంటున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. వారం రోజుల క్రితం అదృశ్యమయితే రాత్రి ఫోన్‌ చేసి డెడ్‌బాడీ దొరికినట్లు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ బిడ్డను అప్పగించకుంటే ప్రిన్సిపల్‌ను, ఎస్‌ఐని వదిలిపెట్టేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ, ప్రిన్సిపల్‌ కలసి గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. తమ బాబును వెతికేందుకు డబ్బులు ఇవ్వాలని ఓ కానిస్టేబుల్‌ అడిగారని మండిపడ్డారు తల్లిదండ్రులు.

డెడ్‌బాడీ తమ మేనల్లుడిది కాదని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి మేనమామ అజయ్‌కుమార్‌. హాస్టల్‌ నుంచి వెళ్లినప్పుడు టీ-షర్ట్‌లో ఉన్నాడని.. మృతదేహానికి మరో డ్రెస్‌ ఉందని ఆరోపించారు. తమ మేనల్లుడి మిస్‌ అయిన సమయంలోనే మరో 10మంది విద్యార్థుల వరకు అదృశ్యం అయ్యారని ప్రిన్సిపల్‌ చెప్పారని, వాళ్లలో ఎవరిదైనా మృతదేహం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్‌లో విద్యార్ధుల పర్యవేక్షణ లోపించిందని, ప్రిన్సిపల్‌, వార్డెన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇదిలావుంటే.. తల్లిదండ్రులు చెప్తున్నట్లు మృతదేహం విద్యార్థి మనోజ్‌ కాకుంటే.. ప్రస్తుతం నర్సీపట్నం ఆస్పత్రిలో ఉన్న డెడ్‌బాడీ ఎవరిది?.. అనేది సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ