AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: జింకకు కరోనా వైరస్.. తొలి కేసు ఆ దేశంలోనే నమోదు.. వ్యవసాయ శాఖ వెల్లడి..!

Coronavirus: గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు సోకిన కరోనా వైరస్ తాజాగా జింకకు కూడా వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి..

Coronavirus: జింకకు కరోనా వైరస్.. తొలి కేసు ఆ దేశంలోనే నమోదు.. వ్యవసాయ శాఖ వెల్లడి..!
Subhash Goud
|

Updated on: Aug 28, 2021 | 8:07 PM

Share

Coronavirus: గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు సోకిన కరోనా వైరస్ తాజాగా జింకకు కూడా వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు. మనుషుల ద్వారా, లేదా జంతు జాతుల ద్వారా జింకకు కరోనా సోకి ఉంటుందని తాము అనుమానిస్తున్నట్లు వైద్యనిపుణులు తెలిపారు.

అయితే గతంలో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన జంతువులకు కరోనా సోకిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ వైద్యనిపుణులు ఒహియోలోని జింకల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా, ఓ జింకకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబోరేటరీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

కాగా, ఇప్పటికే మనుషులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాదికిపైగా ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌.. ఇప్పుడిప్పుడు అదుపులోకి వచ్చింది. ఇక జంతువులకు కూడా సోకవడం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చాలా జంతువులు ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డాయి.

ఇవీ కూడా చదవండి:

India Corona cases: ఇండియాలో టెన్షన్ పెడుతోన్న కొత్త కేసులు.. ప్రమాదకరంగా మరణాల సంఖ్య

Vaccination : ఒక్క రోజే రికార్డు స్థాయి వ్యాక్సినేషన్.. అభినందనలు తెలిపిన మోడీ

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి