AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇండియాను మించి కరోనా టెస్టులు చేశాం’.. ట్రంప్

కరోనా టెస్టుల్లో ఇతర దేశాలకన్నా తాము చాలా ముందున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ విషయంలో ఇండియాతో బాటు మరో 10 దేశాలను మించిపోయామన్నారు. కరోనా వైరస్ పై పోరులో చాలావరకు విజయం సాధించామని, ఇప్పటివరకు దేశంలో 40 లక్షల మందికి పైగా టెస్టులు నిర్వహించామని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఇది ఓ రికార్డు అని వ్యాఖ్యానించారు. భారత్ సహా బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలతో పోలిస్తే మేం […]

'ఇండియాను మించి కరోనా టెస్టులు చేశాం'.. ట్రంప్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 20, 2020 | 11:27 AM

Share

కరోనా టెస్టుల్లో ఇతర దేశాలకన్నా తాము చాలా ముందున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ విషయంలో ఇండియాతో బాటు మరో 10 దేశాలను మించిపోయామన్నారు. కరోనా వైరస్ పై పోరులో చాలావరకు విజయం సాధించామని, ఇప్పటివరకు దేశంలో 40 లక్షల మందికి పైగా టెస్టులు నిర్వహించామని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఇది ఓ రికార్డు అని వ్యాఖ్యానించారు. భారత్ సహా బ్రిటన్, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలతో పోలిస్తే మేం చేసిన టెస్టింగులే అధికం అన్నారు. ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు తగ్గడాన్ని ఫాంటాస్టిస్ అని ఆయన అభివర్ణించారు. తమ దేశంతో గల సరిహద్దులను ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు మూసివేసినందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటాయని ఆయన హెచ్చరించారు. మేం ఇన్ని టెస్టులు నిర్వహించకపోయి ఉంటే ఇంకా ఎన్నో లక్షలమంది మరణించి ఉండేవారని పేర్కొన్నారు. అమెరికాలో రెండు లక్షల 42 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 17, 600 మంది రోగులు మృతి చెందారు.