Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Myanmar Earthquakes: మయన్మార్‌లో ఎందుకు ఇన్ని భూకంపాలు సంభవిస్తాయి?

భారీ భూకంపంతో మయన్మార్, థాయిలాండ్ విలవిల్లాడిపోయింది. వరుస భూకంపాల తీవ్రతతో మరణించినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Myanmar Earthquakes: మయన్మార్‌లో ఎందుకు ఇన్ని భూకంపాలు సంభవిస్తాయి?
Myanmar Earthquakes
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 29, 2025 | 3:59 PM

భారీ భూకంపంతో మయన్మార్, థాయిలాండ్ విలవిల్లాడిపోయింది. వరుస భూకంపాల తీవ్రతతో మరణించినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద చిక్కినవారు హాహాకారాలు చేస్తున్నారు. శిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే జనం వెదుక్కుంటున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

శుక్రవారం (మార్చి 28) మయన్మార్‌లో భూమి ఎంతగా కంపించిందంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అనేక ప్రాంతాలు భూకంపం బారిన పడ్డాయి. మృతుల సంఖ్య వెయ్యి దాటింది. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య కూడా రెండున్నర వేలు. వందలాది మంది ప్రాణాలు ఇంకా గల్లంతయ్యాయి. అటువంటి పరిస్థితిలో, మరణాల సంఖ్య 10,000 దాటవచ్చనే భయం ఉంది.

మయన్మార్‌తో పాటు థాయిలాండ్ భూమి కంపించింది. అయితే, అక్కడ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. థాయిలాండ్‌లో 10 మంది మరణించినట్లు సమాచారం. ఈ భూకంపం రాజధాని బ్యాంకాక్‌లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆకాశహర్మ్యాలు వణుకుతున్నట్లు కనిపించాయి. దీనివల్ల అవి బలహీనంగా మారుతాయనే భయం పెరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద భవనం కుప్పకూలిపోయింది.

అయితే, మయన్మార్‌లో సహాయ, రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాల నుండి మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సహాయ సామగ్రిని పంపుతున్నాయి. భారత ప్రభుత్వం 15 టన్నుల సహాయ సామగ్రిని పంపింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ భూకంపం వచ్చిన వెంటనే, మయన్మార్‌లో వరుసగా అనేక ప్రకంపనలు సంభవిస్తున్నాయి.

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, శుక్రవారం(మార్చి 28) నాడు మయన్మార్‌లో మొత్తం 15 భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం 7.7 తీవ్రతతో సంభవించింది. దీని వల్ల సంభవించిన విధ్వంసం అంతా ఇంతకాదు. దీని తరువాత కూడా, తక్కువ, అధిక తీవ్రత కలిగిన భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఒక భూకంపం 6.4 తీవ్రతతో కూడా వచ్చింది. అటువంటి పరిస్థితిలో, మయన్మార్ ప్రజలు ప్రస్తుతం భయం నీడలో జీవిస్తున్నారు. అయితే, మయన్మార్‌లో ఇన్ని భూకంపాలు సంభవించడం ఇదే మొదటిసారి కాదు. ఇక్కడ భూకంపాలకు చాలా కాలంగా చరిత్ర ఉంది.

మయన్మార్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దులో ఉంది. దీనిని సాగింగ్ ప్రాంతం అంటారు. ప్రపంచంలో అత్యంత భూకంప చురుగ్గా ఉండే దేశాలలో మయన్మార్ ఒకటి. అయితే, సాగింగ్ ప్రాంతంలో భారీ, అతి భారీ విధ్వంసకర భూకంపాలు చాలా అరుదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో ప్రొఫెసర్, భూకంప శాస్త్రవేత్త జోవన్నా ఫౌర్ వాకర్ ఈ భూకంపాలపై తాజాగా స్పందించారు. ‘‘ఇండియా ప్లేట్, యురేషియా ప్లేట్ వేర్వేరు దిశల్లో కదులుతున్నాయి. ఒకటి ఉత్తరం వైపు, మరొకటి దక్షిణం వైపు. ఇది మయన్మార్ మధ్య నుండి వెళుతుంది. ప్లేట్లు ఒకదానికొకటి అడ్డంగా వేర్వేరు వేగంతో కదులుతాయి. దీని వలన “స్ట్రైక్-స్లిప్” భూకంపాలు సంభవిస్తాయి. ఇవి సాధారణంగా సుమత్రా వంటి ప్రాంతాలలో కంటే తక్కువ శక్తివంతమైనవి. ఇక్కడ ఒక ప్లేట్ మరొకటి కిందకు జారిపోతుంది. అందుకే భూకంపాల తీవ్ర ఉంటుంది.’’ శాస్త్రవేత్త జోవన్నా ఫౌర్ వాకర్ అన్నారు.

భూకంపం లోతు తక్కువగా ఉండటం వలన నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త రోజర్ ముస్సన్ అన్నారు. మయన్మార్‌లో భూకంప కేంద్రం కేవలం 10 కి.మీ లోతులో ఉంది. అందుకే నష్టం ఎక్కువగా ఉంది. ‘భూకంప కేంద్రం నిస్సార లోతులో ఉండటం వల్ల, షాక్ తరంగాలు భూకంప కేంద్రం నుండి ఉపరితలం వరకు ప్రయాణించినప్పుడు నాశనం తప్పదు’ అని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితిలో, భవనాలు ప్రకంపనల పూర్తి శక్తిని భరించాల్సి ఉంటుంది. మయన్మార్‌లో ఇదే జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..