Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Jayanti: ఆయన చెప్పిందే మన మార్గం.. మహాత్ముడికి ఐక్యరాజ్యసమితి నివాళి.. చాలా ప్రత్యేకంగా నిలుస్తున్న ట్వీట్‌..

నేడు మహాత్మా గాంధీ జయంతి. ప్రపంచం మొత్తం ఈ రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఓ స్పెషల్ ట్వీట్‌ చేశారు. ఇందులో, అతను అహింస గురించి ఓ చిత్రాన్ని కూడా పంచుకున్నాడు. ఇదే ఇవాళ చాలా ప్రత్యేకంగానిలుస్తోంది.

Gandhi Jayanti: ఆయన చెప్పిందే మన మార్గం.. మహాత్ముడికి ఐక్యరాజ్యసమితి నివాళి.. చాలా ప్రత్యేకంగా నిలుస్తున్న ట్వీట్‌..
Gandhi Jayanti
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 02, 2022 | 10:32 AM

ఈరోజు అక్టోబర్ 2, గాంధీ జయంతి.. భారతీయులు ఈరోజును పండుగలా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా ప్రతి చోటా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మహాత్మా గాంధీని స్మరించుకుంటారు. ‘గాంధీమార్గం’ అనేది నాలుగక్షరాల పదం కాదు- అక్షరాలా అగ్నిపథం. సత్యసంధత, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత- ఆయనను మహాత్ముణ్ని చేశాయి. ఆచరణ విషయంలో ఆయనది అనుష్ఠాన వేదాంతం. ప్రజలు అసంఖ్యాకంగా గాంధీని అనుసరించడానికి కారణం- ఆయన ప్రవచించిన సిద్ధాంతాలు కావు. పాటించిన విలువలు.. అతడు అహింసకు అక్షరాభ్యాసశాల, అతడు సత్యసంధతకు వ్యాఖ్యాన శైలి, అందుకే మహాత్ముడై రహించెను.. అన్నది ప్రత్యక్షర సత్యం. ఆయన చూపిన మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞలు చేస్తారు. భారతీయులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రత్యేకమైన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు.

ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ప్రత్యేక ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ చాలా ప్రత్యేకంగా ఉంది. అంతే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఆంటోనియో గుటెర్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా మనమంతా మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటాం. అతని అందించిన శాంతి, అహింస విలువలను గుర్తుంచుకుందాం. ఆయన అందించిన ఈ విలువలను పాటించడం ద్వారా మనం నేటి సవాళ్లను అధిగమించవచ్చు.. అంటూ ట్వీట్వ్ చేశారు.

మహాత్ముడిని స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

గాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనను స్మరించుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. భారతదేశం స్వాతంత్ర్య మకరందోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ గాంధీ జయంతికి మరింత ప్రత్యేకత ఉంది. ఎల్లప్పుడూ బాపు ఆశయాలకు అనుగుణంగా జీవించండి. గాంధీజీకి నివాళిగా ఖాదీ మరియు హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మీ అందరినీ కోరుతున్నాను.

మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా..

ఈ ప్రత్యేక సందర్భంలో, దేశాధ్యక్షుడు ద్రౌపది ముర్ము కూడా జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకుంటూ దేశానికి సందేశం ఇచ్చారు. మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా దేశప్రజలందరి తరపున జాతిపితకు నివాళులు అర్పిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.

ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు

జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఈరోజు రాజ్‌ఘాట్‌లో సర్వ ధర్మ ప్రార్థనను నిర్వహించినట్లు తెలియజేద్దాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయవార్తల కోసం