AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూకేలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా వైరస్.. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు..

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి లండన్‌

యూకేలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా వైరస్.. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు..
uppula Raju
|

Updated on: Dec 20, 2020 | 12:04 AM

Share

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి లండన్‌ నగరంతో పాటుగా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉన్నపలంగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్‌డౌన్ అమలులోకి వస్తుందని ప్రకటించింది.

మరోవైపు ఈ నెల 25న క్రిస్మస్ ఫెస్టివల్ఉండటంతో ప్రజలు లాక్‌డౌన్ విధించడం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చాలా కుంటుంబాల సభ్యులు కలిసి పండగ జరుపుకోవడం కుదరదు. ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోకపోవడం తనకు కూడా చాలా బాధకలిగిస్తుందని తెలిపారు ప్రధాని బోరిస్ జాన్సన్. కాగా కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. గత మూడు రోజులుగా నమోదైన కేసుల్లో 60 శాతంకు పైబడి కొత్తరకం వైరస్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ వైరస్ 70 శాతం, ఎక్కువగా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్‌కు గురికావల్సి వస్తోందని హెచ్చిరించారు. కొత్తరకం వైరస్‌కు ఇప్పుడున్న వ్యాక్సిన్ పనిచేస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు.