AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: ప్రపంచానికి తాలిబన్లతో పొంచి ఉన్న పెనుముప్పు ‘డ్రగ్స్’..ఎందుకు తాలిబన్లు ఈ వ్యాపారంపై ఆధారపడతారు?

ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ నియంత్రణలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచం నలుమూలల నుండి అందుకుంటున్న రూ. 7.43 లక్షల కోట్లు సహాయం ఆగిపోబోతోంది.

Afghanistan Crisis: ప్రపంచానికి తాలిబన్లతో పొంచి ఉన్న పెనుముప్పు 'డ్రగ్స్'..ఎందుకు తాలిబన్లు ఈ వ్యాపారంపై ఆధారపడతారు?
Afghanistan Crisis
KVD Varma
|

Updated on: Aug 21, 2021 | 4:43 PM

Share

Afghanistan Crisis:  ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ నియంత్రణలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచం నలుమూలల నుండి అందుకుంటున్న రూ. 7.43 లక్షల కోట్లు సహాయం ఆగిపోబోతోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు అమెరికా రూ .70,300 కోట్లు ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ ఫండ్ స్తంభింపజేశారు. ఐఎంఎఫ్ కూడా రూ. 3,450 కోట్ల అత్యవసర నిల్వ నిధిని స్తంభింపజేసింది. రాబోయే కొద్ది రోజుల్లో, ఇతర దేశాలు కూడా సహాయం చేయడం ఆపివేస్తాయి. అప్పుడు ఖర్చులు భరించేందుకు తాలిబాన్లు ఏమి చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తలుచుకుంటేనే ప్రపంచం విన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే ఈ ప్రశ్నకు సాధారణ సమాధానం ఏమిటంటే – తాలిబాన్ ఇప్పుడు డ్రగ్స్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుంది. నల్లమందును డ్రగ్స్ గా  మార్చడం ద్వారా, యూరప్, అమెరికా, భారతదేశంతో సహా అన్ని ఆసియా దేశాలలో విక్రయించడం ద్వారా మునుపటి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. తాలిబాన్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 6,00,000 మందికి పైగా అక్కడి ప్రజలు నల్లమందు సాగుపై మాత్రమే ఆధారపడి ఉన్నారు.

అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో 2001 లో అడుగుపెట్టినప్పటి నుండి, తాలిబాన్ల డ్రగ్ నెట్‌వర్క్ బలహీనపడకుండా బలోపేతం అయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో నల్లమందు సాగు.. పాకిస్తాన్ సహాయంతో, డ్రగ్స్ వ్యాపారం పెరుగుతుంది. ఎందుకంటే, అక్కడ ఉపాధి ఆశ లేదు.

తాలిబన్లు డ్రగ్స్ ఎందుకు అమ్ముతున్నారు?

డ్రగ్స్ వ్యాపారం మాత్రమే 80,000 తాలిబాన్ ఫైటర్లకు ఆర్థిక సాయం చేస్తుంది. నాటో నివేదిక ప్రకారం, 2020 లో, తాలిబాన్లు డ్రగ్స్  నుండి 11 వేల కోట్ల రూపాయలు సంపాదించారు. 2001 లో నల్లమందు ఉత్పత్తి 180 టన్నులు. ఇది 2007 లో 8,000 టన్నులకు పెరిగింది. అఫ్గానిస్తాన్ జిడిపిలో అక్రమ నల్లమందు వ్యాపారం 60%. ప్రపంచంలో వ్యసనాల్లో అత్యంత తీవ్ర వ్యసనంగా చెప్పుకునే  నల్లమందు ఆఫ్ఘనిస్తాన్‌లో పెరుగుతుంది. ఈ నల్లమందు ప్రాసెస్ చేయబడిన డ్రగ్స్ రూపంలో ప్రపంచానికి చేరుకుంటుంది. ప్రాసెస్  చేసిన నల్లమందు అంటే హెరాయిన్. ఇది అసలు నల్లమందు కంటే 1500 రెట్లు ఎక్కువ మత్తును కలిగిస్తుంది.

ఈ వ్యాపారంలో సహాయకులు ఎవరు?

ఆఫ్ఘనిస్తాన్ కు ఈ వ్యాపారంలో అతిపెద్ద సహాయక పాత్ర పాకిస్తాన్ ది. ఆఫ్ఘనిస్తాన్‌లో 70% హెరాయిన్ పాకిస్తాన్ ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలకు చేరుకుంటుంది. డ్రగ్స్ బేరసారాల కేంద్రం దుబాయ్‌లో ఉంది. ఫిబ్రవరి 2021 లో, యూఎస్ ఏజెన్సీలు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి 300 మంది ఆఫ్ఘన్ పౌరులు బ్రిటన్ నుండి ఐదు వేర్వేరు సంస్థల ద్వారా మొత్తం డ్రగ్ నెట్‌వర్క్‌ను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు యూరోప్‌లోని వివిధ దేశాల నుండి చేసేవారు, కానీ ఇప్పటి వరకు వారి జాడ కనుగొనలేకపోయారు.

డబ్బు తాలిబన్లకు ఎలా చేరుతుంది?

పాకిస్థాన్‌తో పాటు, యుఎఇ, చైనా, వర్జిన్ దీవులు, లాట్వియా, హాంకాంగ్, టర్కీలలో తాలిబాన్ కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఆర్గనైజ్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్‌పై బ్రిటిష్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఈ దేశాలలో ఇప్పుడు తాలిబాన్ డబ్బు మొత్తం సేకరణ జరుగుతోంది.

ఆఫ్ఘన్ డ్రగ్స్ ఎక్కడికి వెళ్తాయి?

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చైనా, రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, యూకే, స్పెయిన్, కొలంబియా, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో దొరికే డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి హెరాయిన్ భారతదేశానికి కూడా వస్తోంది.

తాలిబాన్లు అక్రమ రవాణాను ఎందుకు ఆపరు?

ప్రజలకు ఇతర ఉపాధి మార్గాలు లేనంత వరకు, వారు నల్లమందును పెంచుతూ తాలిబాన్లకు విక్రయిస్తూనే ఉంటారు. తాలిబాన్లకు ఉద్యోగాలు కల్పించడంలో అనుభవం లేదు. అతను అధికారాన్ని ఆక్రమించిన వ్యాపారం, ఇప్పుడు అది మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్ కు ఉన్న ఆర్థిక సహాయం ఆగిపోయిన తరువాత, తాలిబాన్లకు  సంపాదించడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం ఇది.

ఆఫ్ఘన్ ఖనిజ సంపదపై చైనా కన్ను..

ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో 75 లక్షల కోట్ల రూపాయల (1 ట్రిలియన్ డాలర్లు) ఖనిజ సంపద ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాగి గనిని కలిగి ఉంది. ఇక్కడ రాగి తవ్వే ప్రక్రియలో చైనా ఉంది. 2008 లో రెండు చైనా కంపెనీలు ఈ గనులను 30 సంవత్సరాల లీజుకు తీసుకున్నాయి, అయితే వీటిని ఇప్పటి వరకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రారంభించడానికి అనుమతించలేదు. ఇప్పుడు తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తరువాత, చైనా గనుల్లో పని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో 55 లక్షల మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత గల రాగి ఉంది. కరోనా సమయంలో ప్రపంచంలో రాగి డిమాండ్ 43% పెరిగింది. అందుకే పాకిస్తాన్ కూడా చైనాతో  పాటు ఈ గనులను కోరుకుంటుంది.

Also Read: Afghanistan Crisis: ఆప్ఘన్‌లో మళ్లీ కాలకేయుల రాజ్యం.. భారత్ మౌనం వెనుక కారణాలు

Afghanistan Crisis: తాలిబన్లకు భారత్ దౌత్యపరమైన గుర్తింపు ఇస్తుందా? దౌత్యపరమైన గుర్తింపు..దాని ప్రాధాన్యత తెలుసుకోండి!

Afghanistan Crisis: ఆఫ్ఘన్ పరిణామాలపై భారత్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది?

Follow Us