Afghanistan Crisis: తాలిబన్లకు భారత్ దౌత్యపరమైన గుర్తింపు ఇస్తుందా? దౌత్యపరమైన గుర్తింపు..దాని ప్రాధాన్యత తెలుసుకోండి!

ఆగస్టు 15 న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. దీనితో దేశం మొత్తం నియంత్రణ తాలిబన్ల చేతికి వచ్చింది.

Afghanistan Crisis: తాలిబన్లకు భారత్ దౌత్యపరమైన గుర్తింపు ఇస్తుందా? దౌత్యపరమైన గుర్తింపు..దాని ప్రాధాన్యత తెలుసుకోండి!
Afghanistan Crisis India Diplomacy
Follow us

|

Updated on: Aug 18, 2021 | 3:59 PM

Afghanistan Crisis: ఆగస్టు 15 న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. దీనితో దేశం మొత్తం నియంత్రణ తాలిబన్ల చేతికి వచ్చింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోయారు. ఒక రోజు తరువాత, చైనా అధికారికంగా తాలిబాన్ పాలనను గుర్తించింది. ఆఫ్ఘన్ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే హక్కును చైనా గౌరవిస్తుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు. చైనా ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహపూర్వక,  సహకార సంబంధాలను నిర్మించాలని కోరుకుంటుంది. అంతకుముందు జూలై 28 న, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలనను గుర్తించాలని చైనా సూచించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తొమ్మిది మంది సభ్యుల తాలిబాన్ ప్రతినిధి బృందంతో టియాంజిన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు, ఉప నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ కూడా ఉన్నారు.

దౌత్య స్థాయిలో గుర్తింపు పొందడం అంటే ఏమిటి? ప్రాంతీయ స్థిరత్వంపై చైనా తీసుకున్న ఈ చర్య ప్రభావం ఏమిటి? భారతదేశంలో తాలిబాన్లకు దౌత్యపరమైన గుర్తింపు ఇవ్వడం గురించి చర్చలు ఏమిటి? ఈ విషయాల గురించి తెలుసుకుందాం..

దౌత్య గుర్తింపు అంటే ఏమిటి?

ఒక విధంగా చెప్పాలంటే, దౌత్య సంబంధాలను నిర్మించడంలో ఇది మొదటి అడుగు. ”ఒక సార్వభౌమ, స్వతంత్ర దేశం మరొక సార్వభౌమ లేదా స్వతంత్ర దేశాన్ని గుర్తించినప్పుడు, ఆ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమవుతాయి”. గుర్తింపు ఇవ్వాలా వద్దా అనేది రాజకీయ నిర్ణయం. దౌత్య సంబంధాలు ఏర్పడితే, రెండు దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలి. అదేవిధంగా వాటిని గౌరవించాలి. ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం ద్వారా మాత్రమే గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది. కొత్త ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల నుండి ఈ గుర్తింపు పొందినప్పుడు, దాని స్వాతంత్య్రం, ఉనికి, సంభాషణ కోసం దౌత్య పరమైన వేదికలు, అంతర్జాతీయ న్యాయస్థానాలను ఉపయోగించడం సులభం అవుతుంది.

దౌత్యపరమైన గుర్తింపు అంటే దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందంలో(1961) పేర్కొన్న విధంగా..  రెండు దేశాలు అధికారాలు, బాధ్యతలను అంగీకరిస్తాయి. దీని కింద, ఇరు దేశాల అధికారులకు ఒకరికొకరు కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చుకుంటారు. రాయబార కార్యాలయం లేదా అధిక కమిషన్‌ని రక్షించడం వారి బాధ్యత అవుతుంది.

ఈ గుర్తింపు శాశ్వతంగా ఉన్నప్పటికీ, మారుతున్న పరిస్థితులలో, ప్రభుత్వాలు దానిలో మార్పులు చేయవచ్చు. ఒక దేశం మరొక దేశ ప్రభుత్వాన్ని గుర్తించకపోతే, ఆ దేశంతో దౌత్య సంబంధాలన్నీ రద్దు అవుతాయి. సంబంధిత దేశపు దౌత్యవేత్తలు ఆ దేశంలో నివసించరు.

ఏదైనా దేశంపై దౌత్యపరమైన గుర్తింపు పొందకపోవడం ప్రభావం ఏమిటి?

ఏదైనా దేశంలో ప్రభుత్వాలు గుర్తించబడకపోతే, ఆ దేశం అంతర్జాతీయ ఒప్పందంలో చేరదు. అంతర్జాతీయ వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం వారికి లభించదు. వారి దౌత్య ప్రతినిధులు విదేశాలలో చట్టపరమైన చర్యల నుండి మినహాయించబడరు. వారు ఏ ఇతర ప్రభుత్వం ముందు లేదా విదేశీ న్యాయస్థానాల ముందు నిరసన తెలపలేరు.

ఒక ప్రభుత్వం తన దేశంలో విదేశీ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని లేదా అంతర్జాతీయ జవాబుదారీతనం నెరవేర్చలేకపోతోందని విశ్వసించినప్పుడు ఇతర దేశాలతో సంబంధాలు క్షీణించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో బాధ్యతను నిర్వర్తించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని అక్కడి కొత్త ప్రభుత్వాలు నిర్ధారించినప్పుడు సైనిక తిరుగుబాటు లేదా తిరుగుబాటు కూడా గుర్తించబడుతుంది. ఉదాహరణకు బర్మాను తీసుకుంటే కనుక.. ఆరు నెలల క్రితం అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్యం అక్కడ పరిపాలనను ఆక్రమించింది. సమాంతర ప్రభుత్వం కూడా నడుస్తోంది. కొత్త ప్రభుత్వానికి  అంతర్జాతీయంగా గుర్తింపులేదు. దీంతో దౌత్య మార్గాల ద్వారా వీలైనన్ని ఎక్కువ దేశాల నుండి గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోంది.

తాలిబాన్‌లకు అంతర్జాతీయ సోదరుల నుండి దౌత్యపరమైన గుర్తింపు లభిస్తుందా లేదా?

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని 1996 లో పాకిస్తాన్, యుఎఇ, సౌదీ అరేబియా గుర్తించాయి. ఈసారి పరిస్థితులు మారాయి. ఈసారి చాలా దేశాలు తాలిబాన్లను గుర్తించడానికి సిద్ధమవుతున్నాయని ఇది సూచిస్తుంది. తాలిబాన్ పాలనను గుర్తించడానికి చైనా సమయం తీసుకోలేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై ఇప్పటివరకు రెండు సమావేశాలు నిర్వహించింది. రెండు సమావేశాలలో, ప్రభుత్వం ప్రజలతో బలవంతంగా విధించిన గుర్తింపు గుర్తించబడదని సూచన వచ్చింది.  ఇప్ప్పుడు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ల ముందు మూడు లక్షల మంది సైనికులు ఆయుధాలు విడిచిపెట్టినందున, 1990 ల కంటే అధికారం బదిలీ కూడా సులభంగా జరిగిపోతుంది.

అధికార మార్పిడిలో ఎలాంటి హింస జరగలేదని తాలిబాన్ అంతర్జాతీయ సమాజానికి చూపించడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ విధంగా, అంతర్జాతీయ సమాజం నుండి దౌత్యపరమైన గుర్తింపు పొందాలనే ఆశ పెరిగింది. యూఎన్ లో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ దౌత్యపరమైన గుర్తింపుపై సెప్టెంబర్‌లో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని మీడియా నివేదికలు చెబుతున్నాయి. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవా మీడియాతో చెబుతున్న దాని ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ కొత్త భద్రత, ఆర్థిక నిర్మాణం గత 20 సంవత్సరాల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాన్ వంటి దేశాలు తమ ప్రభావాన్ని పెంచుతాయి. యుఎస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, చైనా, పాకిస్తాన్ తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాయి.

భారత్ కూడా తాలిబాన్ పాలనను ఆమోదించగలదా?

ఈ సమయంలో ఏదైనా చెప్పడం కష్టం. జూన్‌లో, ఖతార్ అధికారిని ఉటంకిస్తూ భారతదేశం కూడా తాలిబాన్‌లతో టచ్‌లో ఉందని నివేదికలు వచ్చాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశ పెట్టుబడిని కాపాడటమే లక్ష్యంగా ఉంది. ఈ నివేదికలను భారత ప్రభుత్వం ఖండించలేదు. ఈ చర్యను భారత దౌత్యం పర్యవేక్షిస్తున్న నిపుణులు స్వాగతించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో ఉన్నామని భారతదేశం స్పష్టంగా చెప్పింది. వారి అభ్యున్నతికి కృషి చేస్తూనే ఉంటామని భారత్ చెబుతూ వస్తోంది.  ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన భారతదేశ దౌత్యం అమెరికాతో అనుసంధానించడం ద్వారా చూస్తున్నారు.  ఇది కూడా పెద్ద తప్పు. అమెరికా, భారతదేశ ప్రభావాన్ని తగ్గించడానికి చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.

భారతదేశం దౌత్యపరమైన గుర్తింపు ఇవ్వని దేశం ఏదైనా ఉందా?

రాజ్యసభలో ఈ ప్రశ్నకు సమాధానంగా, 22 సెప్టెంబర్ 2020 న ప్రభుత్వం అలాంటి దేశం ఏదీ లేదని చెప్పింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నింటికీ భారతదేశం దౌత్యపరమైన గుర్తింపును ఇచ్చింది. భారతదేశంలో 197 మిషన్లు/పోస్టులు, 3 ప్రతినిధి కార్యాలయాలు విదేశాలలో పనిచేస్తున్నాయి. అంటే, ఆఫ్ఘనిస్తాన్ కొత్త పాలనకు ఐక్యరాజ్యసమితిలో ఆమోదం లభిస్తే, అది తాలిబాన్లను కూడా గుర్తించగలదని తెలుస్తోంది. ఈ రకంగా చూస్తే భారతదేశ వైఖరి స్పష్టంగా ఉంది.

Also Read: Afghanistan Crisis: ఆఫ్ఘన్ పరిణామాలపై వ్యూహాత్మకంగా వేచి చూసే ధోరణిలో భారత్.. పరిస్థితి ప్రమాదకరమే అంటున్న కాంగ్రెస్!

Afghanistan Crisis: తాలిబన్ 2.0 ప్రారంభం అవుతోంది..ఇది మళ్ళీ ఉగ్రవాదులకు ఊపిరి అందిస్తుందా? అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు?

మరిన్ని ఆఫ్గనిస్తాన్ సంక్షోభానికి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు