AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: యూరప్‌ పర్యటనకు భారత ప్రధాని.. మోదీ టూర్‌కు ముందు మాస్కోలో అతిపెద్ద దాడి!

ఉక్రెయిన్‌ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయల్దేరారు. ఈ సమయంలో మాస్కోలో అతిపెద్ద డ్రోన్ దాడి జరగడం విశేషం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో పర్యటించిన అనంతరం ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు.

PM Modi: యూరప్‌ పర్యటనకు భారత ప్రధాని.. మోదీ టూర్‌కు ముందు మాస్కోలో అతిపెద్ద దాడి!
Narendra Modi To Europe
Balaraju Goud
|

Updated on: Aug 21, 2024 | 11:49 AM

Share

ఉక్రెయిన్‌ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయల్దేరారు. ఈ సమయంలో మాస్కోలో అతిపెద్ద డ్రోన్ దాడి జరగడం విశేషం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో పర్యటించిన అనంతరం ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. ఆగస్టు 23న అక్కడికి రానున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అయితే దీనికి ముందు రష్యాలోని మాస్కోపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడికి తెగబడింది.

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్‌ పర్యటనకు వెళ్తున్నారు. మొదట పోలాండ్‌ను సందర్శించి, ఆపై యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను సందర్శించబోతున్నారు. పోలాండ్-ఉక్రెయిన్ పర్యటనకు ముందు, పోలాండ్ భారతదేశానికి ప్రధాన ఆర్థిక భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య త్వరలో శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

ప్రధాని మోదీ తొలుత ఆగస్టు 21, 22 తేదీల్లో రెండు రోజుల పోలాండ్‌లో పర్యటించనున్నారు. దీని తర్వాత పోలాండ్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రధాని రైలులో వెళ్తారు. ఈ ప్రయాణం దాదాపు 10 గంటల సమయం పడుతుంది. యుద్ధం కారణంగా గగనతలం మూసివేయడంతో రైలులో వెళ్తున్నారు. 30 ఏళ్ల క్రితమే భారత్, ఉక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

అయితే ప్రధాని పర్యటనకు ముందు రష్యాలోని మాస్కోపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడికి తెగబడింది. ఈ దాడికి సంబంధించి, మాస్కో మేయర్ స్పందించారు. మాస్కోపై ఇప్పటివరకు ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడులలో ఒకటి. ఇందులో, రష్యా వైమానిక రక్షణ విభాగాలు రాజధాని వైపు ఎగురుతున్న కనీసం 10 డ్రోన్‌లను ధ్వంసం చేశాయని మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. పోడోల్స్క్ నగరంలో కొన్ని డ్రోన్లను ధ్వంసం చేసినట్లు మేయర్ చెప్పారు. మాస్కో ప్రాంతంలోని నగరం క్రెమ్లిన్‌కు దక్షిణంగా 38 కిలోమీటర్లు దూరంలో ఉంది.

రక్షణ మంత్రిత్వ శాఖ, వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు UAV దాడులను తిప్పికొడుతూనే ఉన్నాయని మేయర్ సోబియానిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శిథిలాలు పడిపోయిన చోట ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. గతేడాది మేలో జరిగిన డ్రోన్‌ దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. గత ఏడాది మాస్కోలోని 8 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. ఈసారి 10 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. ఇది కాకుండా, రష్యా నైరుతి సరిహద్దులోని బ్రయాన్స్క్ ప్రాంతంలో డ్రోన్ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని బ్రయాన్స్క్ ప్రాంతం గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు.

ఉత్తరాన మాస్కో ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతంలో రెండు డ్రోన్లు ధ్వంసమయ్యాయి. అదనంగా, రష్యా నైరుతిలో ఉన్న రోస్టోవ్ ప్రాంత గవర్నర్ వాసిలీ గోలుబెవ్, వాయు రక్షణ దళాలు ఈ ప్రాంతంపై ఉక్రేనియన్ క్షిపణిని ధ్వంసం చేశాయని, అయితే ప్రాణనష్టం గురించి సమాచారం లేదని అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..