Sri Lanka Crisis: మహీంద రాజపక్స కుటుంబాన్ని వెంటాడుతోన్న ఆందోళన కారులు.. నేవీ స్థావరంలో  తల దాచుకున్నా..

Sri Lanka Crisis: ప్రధాని పీఠం నుంచి వైదొలగిన మహీంద రాజపక్స (Mahinda Rajapaksa), అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) తదితర రాజకీయ నాయకులకు నిరసనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

Sri Lanka Crisis: మహీంద రాజపక్స కుటుంబాన్ని వెంటాడుతోన్న ఆందోళన కారులు.. నేవీ స్థావరంలో  తల దాచుకున్నా..
Mahinda Rajapaksa
Follow us

|

Updated on: May 10, 2022 | 5:16 PM

Sri Lanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక(Sri Lanka)లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ మద్దతు దారుల మధ్య పరస్పర ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక ఆందోళనలతో ప్రభుత్వ ఆస్తులు, భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండడమే కాకుండా ఈ అల్లర్లలో వేలాదిమంది గాయపడుతున్నారు. కాగా ప్రధాని పీఠం నుంచి వైదొలగిన మహీంద రాజపక్స (Mahinda Rajapaksa), అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) తదితర రాజకీయ నాయకులకు నిరసనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల మహీంద కేబినెట్‌ మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతల నివాసాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియాన్ని కూడా తగలబెట్టారు. ఇక కరునెగాలలోని మహీంద నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు.

పెట్రోల్ బాంబులతో దాడి..

కాగా తాజాగా ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్‌ ట్రీస్‌ను కూడా ఆందోళన కారులు ముట్టడించారు. బారికేడ్లను దాటుకుని భవనంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కొందరు నిరసనకారులు భవనం కాంపౌండ్‌లోకి పెట్రోల్‌ బాంబులు కూడా విసిరి విధ్వంసం సృష్టించారు. ప్రధాని భద్రతాసిబ్బంది ఆందోళనకారులపై భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అత్యంత భద్రత నడుమ సైన్యం మహీంద, ఆయన కుటుంబసభ్యులను ట్రింకోమలిలోని నౌకాదళ స్థావరానికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నేవీ బేస్‌ శ్రీలంక రాజధాని కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా ట్రింకోమలి నౌకాదళ స్థావరం వద్ద మహీంద, కొంత మంది కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం రాగానే నిరసనకారులు అక్కడకు చేరుకుని ఆందోళనలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక మహీంద కుమారుడు నమల్ కుటుంబం కొలంబోను వీడి అజ్ఞాత ప్రాంతానికి వెళ్లినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం  క్లిక్ చేయండి..

 Also Read: 

Healthy Foods for Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయిందా? ఆరోజే రానుందంటూ జోరుగా ఊహాగానాలు..

Harish Rao: అబద్ధాల్లో బీజేపీకి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వచ్చు.. ఆ రెండు పార్టీలు తెలంగాణకు హానికరం: మంత్రి హరీశ్‌

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..