AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్తాన్ లో మరణ మృదంగం.. విజృంభిస్తోన్న న్యుమోనియా.. 200 మంది చిన్నారుల మృతి..

గత మూడు వారాల్లో విపరీతమైన శీతలగాలుల వలన న్యుమోనియా విజృంభిస్తోందని    పంజాబ్ ప్రావిన్స్‌లో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. మరణించిన పిల్లల్లో చాలామంది చిన్నారులకు "న్యుమోనియాకు టీకాలు వేయలేదు. పోషకాహార లోపం,  తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది." చలి తీవ్రత కారణంగా జనవరి 31 వరకు ప్రావిన్స్‌లోని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

Pakistan: పాకిస్తాన్ లో మరణ మృదంగం.. విజృంభిస్తోన్న న్యుమోనియా.. 200 మంది చిన్నారుల మృతి..
Pakistan Pneumonia
Surya Kala
|

Updated on: Jan 27, 2024 | 10:47 AM

Share

పాకిస్తాన్ లో గత మూడు వారాల నుంచి శీతాకాల గాలులు వీస్తున్నాయి. దీంతో న్యుమోనియా విజృంభిస్తోంది.  జనవరి 1 నుండి ప్రావిన్స్‌లో మొత్తం 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 220 మరణాలు సంభవించాయి. వీరిలో ఎక్కువగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే అని అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్షియల్ రాజధాని లాహోర్‌లో 47 మరణాలు సంభవించాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. గత మూడు వారాల్లో విపరీతమైన శీతలగాలుల వలన న్యుమోనియా విజృంభిస్తోందని    పంజాబ్ ప్రావిన్స్‌లో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

మరణించిన పిల్లల్లో చాలామంది చిన్నారులకు “న్యుమోనియాకు టీకాలు వేయలేదు. పోషకాహార లోపం,  తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.” చలి తీవ్రత కారణంగా జనవరి 31 వరకు ప్రావిన్స్‌లోని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

పంజాబ్‌లోని ఇమ్యునైజేషన్‌పై ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ తమ దేశంలో పుట్టిన  శిశువులకు ఆరు వారాల తర్వాత  పిసివి అనే మొదటి యాంటీ-న్యుమోనియా వ్యాక్సిన్‌ని ఇస్తారని పేర్కొన్నారు.  పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వయస్సు వరకు ఈ వ్యాక్సిన్ అనేక రకాల వ్యాధులపై పోరాడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

“న్యుమోనియా బాక్టీరియా, వైరస్ రెండింటి వలన సంభవించవచ్చని.. కనుక టీకాలు వేసిన పిల్లలు బ్యాక్టీరియా సంక్రమణ నుంచి సురక్షితంగా ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పిల్లలు న్యుమోనియా బారిన పడకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, ఉన్ని దుస్తులను  ధరించాలని ప్రభుత్వం కోరింది. అంతేకాదు న్యుమోనియా బారిన పడకుండా పిల్లలను రక్షించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీనియర్ వైద్యులను కోరింది.  చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా వ్యాపిస్తుందని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏది? ఆరోగ్యకరమైన రోజుకు బలమైన ఆరంభం ఇదే..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
పాడి రైతులు ఈ విషయం తెలుసుకోండి..
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రం పఠిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
ఇవి గుండెకు దివ్యౌషధం.. రోజుకు ఒకటి రెండు తింటే గుండెపోటుకు చెక్‌
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!