Russia Ukraine War Updates: ఒకవైపు కాల్పుల విరమణ.. మరోవైపు దాడులు.. సుమీ నగరంపై విరుచుకుపడ్డ రష్యా
Russia Ukraine Conflict Updates in Telugu: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. గత 13 రోజులుగా కొనసాగుతున్న షెల్లింగ్ మొత్తం దేశాన్ని నాశనం చేసింది. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా రెండు దేశాల్లో ఏ ఒక్కటీ తలవంచేందుకు సిద్ధంగా లేకుంటే. మరోవైపు ఇలాంటి దాడితో చాలా దేశాలు రష్యాకు దూరమయ్యాయి.

Russia Ukraine War Live Updates: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. గత 13 రోజులుగా కొనసాగుతున్న షెల్లింగ్ మొత్తం దేశాన్ని నాశనం చేసింది. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా రెండు దేశాల్లో ఏ ఒక్కటీ తలవంచేందుకు సిద్ధంగా లేకుంటే. మరోవైపు ఇలాంటి దాడితో చాలా దేశాలు రష్యాకు దూరమయ్యాయి. మరోవైపు, పౌరుల(Civilians)ను తరలించేందుకు సోమవారం ఉదయం నుంచి కాల్పుల విరమణతో పలు ప్రాంతాల్లో మానవతా కారిడార్లను ప్రారంభిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, తరలింపు మార్గం ఎక్కువగా రష్యా, దాని మిత్రదేశాలైన బెలారస్(Belarus) వైపు వెళుతోంది. పౌరులను ఖాళీ చేయిస్తున్నారా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే, రష్యా దళాలు కొన్ని ఉక్రేనియన్ నగరాలపై రాకెట్ దాడుల(Missiles Attack)ను కొనసాగించాయి. కొన్ని ప్రాంతాలలో భీకర పోరాటాన్ని కొనసాగించాయి.
ఉత్తర, దక్షిణ మధ్య ఉక్రెయిన్లోని నగరాల్లో రష్యా కాల్పులు జరుపుతుండటంతో వేలాది మంది ఉక్రేనియన్లు సురక్షితంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని కైవ్, దక్షిణ ఓడరేవు నగరం మారియుపోల్, ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్, సుమీ నుండి పౌరుల తరలింపు కోసం కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఖార్కివ్ రీజియన్ పోలీసులు సోమవారం ఒక్కరోజే 209 మంది మరణించారని, వారిలో 133 మంది పౌరులేనని చెప్పారు. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ను వదిలి ఇప్పటి వరకు 17 మిలియన్లకు పైగా ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. మరికొంతమంది నగరాల్లో షెల్లింగ్లో చిక్కుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
తీవ్ర ఒత్తిడికి లోనైన రష్యా కరెన్సీ
ఉక్రెయిన్ మీద దాడితో పశ్చిమ దేశాలు రష్యా మీద అనేక ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించాయి. అయితే, అతి కీలకమైన గ్యాస్, ఆయిల్ ఇండస్ట్రీల జోలికి మాత్రం పోలేదు. రష్యా ఆర్ధిక వ్యవస్థలు, బ్యాంకింగ్ రంగం, కరెన్సీ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి.
-
పుతిన్పై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు పుతిన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పుతిన్ ఓ మానవమృగమంటూ ఘాటుగా స్పందించారు. పుతిన్ యుద్ధోన్మాదం ఒక్క ఉక్రెయిన్తోనే ఆగదని..మిగిలిన దేశాలపైనా పుతిన్ దాడికి దిగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యుద్ధం ఆపే సామర్థ్యం బైడెన్కు ఉందన్నారు జెలెన్స్కీ.
-
-
యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరికాసేపట్లో..
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రష్యాపై తన ప్రసంగాన్ని కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఇందులో అతను రష్యాపై ఆంక్షలు విధించడం గురించి మాట్లాడవచ్చు.
-
రక్తపాతాన్ని ఆపండి.. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి ఆ దేశ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకొవిచ్ ఓ విజ్ఞప్తి చేశారు. యుద్ధం వల్ల జరుగుతున్న రక్తపాతాన్ని ఆపాలని కోరారు. ప్రెసిడెన్షియల్ కెపాసిటీలో తాను జెలెన్స్కీతో మాట్లాడాలనుకుంటున్నానని, మరీ ముఖ్యంగా కాస్త తండ్రి మాదిరిగా మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు.
-
రష్యాపై ఆంక్షలు సరికాదు – చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్
రష్యాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షుల్ట్లతో చర్చల్లో జి జిన్పింగ్ ఉక్రెయిన్పై దాడికి రష్యాపై విధించిన ఆంక్షలు అన్ని పార్టీలకు హానికరంగా ఉన్నాయని విమర్శించారు. రష్యాకు మద్దతు ఇస్తూనే వివాదాన్ని ప్రేరేపించినందుకు అమెరికా దాని మిత్రదేశాలను చైనా తప్పుపట్టింది. మాస్కో తన చర్యలను ఖండించాలా వద్దా అనే దానిపై ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ చేయకుండా చైనా కూడా దూరంగా ఉంది.
-
-
సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఊరట..
ఉక్రెయిన్లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఊరట లభించింది. వీరందరూ సుమీ నుంచి బస్సులలో బయల్దేరారు. ఈ విషయాన్ని విద్యార్థులను సమన్వయం చేస్తున్న అన్షద్ అలీ అనే వ్యక్తి వెల్లడించారు. అతను చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ధ్రువీకరించారు. సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులు పోల్టావాకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూమ్ నుంచి సోమవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం 694 మంది విద్యార్థులు సుమీలో ఉన్నట్లు వెల్లడిచారు. వీరంతా బస్సుల్లో బయలుదేరారని చెప్పారు.
#WATCH | A convoy consisting of 12 buses left from Sumy, Ukraine earlier today. All Indians there have been evacuated. Officials of the Indian Embassy & Red Cross are escorting them. Bangladeshis & Nepalis have also been facilitated. They are currently enroute to Poltava region. pic.twitter.com/0ieUCcjl0S
— ANI (@ANI) March 8, 2022
-
ఉక్రెయిన్పై భారీ బాంబులతో దాడులు.. ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి
రష్యా ఉక్రెయిన్పై దాడులను తీవ్రతరం చేసింది. పలు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. చాలా ప్రాంతాల్లో నివాస గృహాలే లక్ష్యంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా.. ఉక్రెయిన్లోని సుమీ నగరంలో రష్యా చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వీరిలో ఇద్దరు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మానవత్వాన్ని మంటగలుపుతూ గత రాత్రి రష్యన్ సైన్యం సుమీలో మారణ హోమానికి పాల్పడినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా నివాస భవనాలపై 500 కిలోల బాంబు వేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారంటూ అంటూ ఉక్రెయిన్ ట్విటర్ వేదికగా తెలిపింది.
#WATCH | Empty bullet shells seen on the ground in the war-torn Irpin, a city near Kyiv, the capital of #Ukraine. Civilians move to safer locations amid #RussiaUkraineConflict pic.twitter.com/z2wjaAcRu8
— ANI (@ANI) March 8, 2022
-
కైవ్లోని భారతీయులకు కీలక సూచన..
ఉక్రెయిన్ రాజధాని కైవ్లోని భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. మార్చి 8 ఉదయం 10 గంటల నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. కాబట్టి ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులందరూ దీనిని సద్వినియోగం చేసుకుని ఎలాగైనా సరిహద్దుకు చేరుకోవాలని అందులో పేర్కొంది.
-
సుమీ నుంచి 12 బస్సుల్లో భారతీయ విద్యార్థులు..
ఉక్రెయిన్లోని సుమీ నుంచి 12 బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. అక్కడ ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా తరలించారు. ఇండియన్ ఎంబసీ, రెడ్క్రాస్ అధికారులు వారికి ఎస్కార్ట్ చేస్తున్నారు. బంగ్లాదేశీయులు, నేపాలీలకు కూడా సౌకర్యం కల్పించబడింది. ప్రస్తుతం వారు పోల్తావా ప్రాంతానికి వెళ్తున్నారు.
-
ఉక్రెయిన్కు హాలీవుడ్ టైటానిక్ హీరో రూ.77కోట్లు విరాళం..
హాలీవుడ్ సూపర్స్టార్, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఉక్రెయిన్కు తన వంతు సాయం చేశారు. 10 మిలియన్ డాలర్లు (రూ.77కోట్లు) విరాళంగా అందించారు. రష్యా దాడులతో భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశానికి అండగా నిలిచారు. అయితే తాను సాయం చేసిన విషయాన్ని డికాప్రియో గుట్టుగా ఉంచాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ వైస్గ్రాడ్ ఫండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
-
రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసేంది లేదు.. -షెల్
ఉక్రెయిన్ పై రష్యా దాడి చూస్తుండటంపై ఇంధన రంగ దిగ్గజం షెల్ కీలక ప్రకటన చేసింది. రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసేంది లేదని షెల్ తెగేసి చెప్పింది. షెల్ అమెరికా కంపెనీ కావడంతో ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
-
ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన తమిళ విద్యార్థి.. కోయంబత్తూరులో ఇంటెలిజెన్స్ తనిఖీలు
తమిళనాడు కోయంబత్తూర్ లో ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారణమేంటంటే.. ఉక్రెయిన్ ఆర్మీలో చేరాడో తమిళ విద్యార్ధి. గతంలో ఇతడు ఇండియన్ ఆర్మీలో చేరడానికి విఫలయత్నం చేశాడు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం సైన్స్ టెక్నాలజీ స్టూడెంట్ అయిన రవిచంద్రన్ ఉక్రెయిన్ ఆర్మీలో చేరడంపై అధికారులు అతడింటిలో తనిఖీలు చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ లో చేరాలన్నది రవిచంద్రన్ చిన్ననాటి కోరికనీ.. అదిక్కడ నెరవేరక పోవడంతో అక్కడ ఆర్మీలో చేరి ఉంటాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.
-
సుమీలోని భారతీయుల పరిస్థితిపై ఆందోళన
సుమీలో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. అక్కడి భారతీయుల పరిస్థితిపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో సుమీలో పరిస్థితిపై భారతీయ ప్రతినిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమీలో రష్యా ఒక చోట 500 కేజీల భారీ బాంబును కూడా ప్రయోగించింది. హ్యుమన్ కారిడార్ను ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని అటు రష్యా , ఇటు ఉక్రెయిన్ పట్టించుకోవడం లేదని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు భారత్ ఒత్తిళ్లకు ఇరుదేశాలు తలొగ్గాయి. భారతీయుల తరలింపుకు హ్యూమన్ కారిడార్ను ఏర్పాటు చేశారు. దీంతో సుమీ నుంచి తొలి బ్యాచ్ తరలింపు మొదలయ్యింది.
-
దేశంలోనే ఉన్నా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
తాను దేశం విడిచిపారిపోయినట్టు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి తీవ్రంగా ఖండించారు. తాను ఉన్న లొకేషన్ వీడియోతో సహా విడుదల చేశారు జెలెన్స్కీ.
-
సుమీలో చిక్కుకున్న భారతీయులను సరిహద్దుల్లోకి తరలిస్తున్న అధికారులు
సుమీలో చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భారతీయుల పరిస్థితిపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో సుమీలో పరిస్థితిపై భారతీయ ప్రతినిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమీలో రష్యా ఒక చోట 500 కేజీల భారీ బాంబును కూడా ప్రయోగించింది. హ్యుమన్ కారిడార్ను ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని అటు రష్యా , ఇటు ఉక్రెయిన్ పట్టించుకోవడం లేదని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు భారత్ ఒత్తిళ్లకు ఇరుదేశాలు తలొగ్గాయి. భారతీయుల తరలింపుకు హ్యూమన్ కారిడార్ను ఏర్పాటు చేశారు.
-
తెరుచుకున్న సరిహద్దు గేట్లు.. భారీ ఎత్తున తరలిపోతున్న ఉక్రెయన్ వాసులు..
ఉక్రెయిన్ నుంచి నిష్క్రమించడానికి సురక్షిత కారిడార్లు మంగళవారం తెరుచుకున్నాయి. ఉక్రెయిన్ తూర్పు నగరమైన సుమీ నుంచి పౌరులను తరలించడానికి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్చుక్ మంగళవారం తెలిపారు. బస్సులు లేదా ప్రైవేట్ కార్లలో మొదటి కాన్వాయ్ ఉక్రేనియన్ నగరం పోల్టావా నుంచి ఉదయం 10 గంటలకు (0800 GMT) బయలుదేరింది.
-
దేశం విడిచి వెళ్లిన 17 లక్షల మంది ఉక్రెయినియన్స్..
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్కు చెందిన దాదాపు 17 లక్షల మంది బ్రతుకు జీవుడా అంటూ దేశం విడిచి వెళ్లిపోయారు. వీరందరూ పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు. దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులకు పోలాండ్ తమ దేశంలో ఆశ్రయం కల్పించింది. ఉక్రెయిన్- రష్యా సంక్షోభానికి తక్షణమే తెరపడని పక్షంలో లక్షలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది.
-
కాల్పుల విరమణతో మరో 600 మంది భారతీయుల తరలింపు..
సుమీలో కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో అక్కడి భారతీయ వైద్య విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. వారి వెంట రెడ్క్రాస్, ఇండియన్ ఎంబసీ అధికారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారని తెలుస్తోంది. రష్యా వైపు నుంచి నిరంతర కాల్పుల కారణంగా.. వారిని ఇప్పటివరకు ఖాళీ చేయలేకపోయారు.
-
ఉక్రెయిన్కి లియోనార్డో డికాప్రియో భారీ విరాళం
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్కు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో బాసటగా నిలిచారు. ఉక్రెయిన్కు లియోనార్డో రూ.76.9 కోట్ల విరాళం ప్రకటించారు.
Leonardo Dicaprio
-
సుమీలో ఇద్దరు చిన్నారుల మృతి
ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా దాడి ముమ్మరం చేసింది. ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది చనిపోయారు. రెస్క్యూ సిబ్బంది ఇళ్ల శిథిలాల కింద నుంచి పౌరుల మృతదేహాలను బయటకు తీశారు.
-
కివ్లో ప్రజలను తరలిస్తున్న బస్సుపై రష్యా దాడి..
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం కివ్ నుంచి ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆ నగరాన్ని వీడి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 6 లక్షల మందిని నగరం నుంచి తరలిపోయినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
❗️ #Ukrainian authorities claim that #Russian troops shelled an evacuation bus and a number of villages in the #Kyiv region: Three people were wounded. pic.twitter.com/zP7pKDN2CT
— NEXTA (@nexta_tv) March 8, 2022
-
అణు కర్మాగారాన్ని ధ్వంసం చేసిన రష్యా సైన్యం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య జరిగిన దాడిలో రెండవ అణు కర్మాగారం ధ్వంసమైంది. ఇప్పటి వరకు రేడియేషన్ లీకేజీకి సంబంధించిన వార్తలేమీ లేకపోయినా ప్రమాదం మాత్రం అలాగే ఉంది.
-
ఖర్కివ్ నుంచి తరలిపోయిన 6 లక్షల మంది
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లోని రెండో అతిపెద్ద నగరం ఖర్వివ్ నుంచి ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆ నగరాన్ని వీడి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 6 లక్షల మందిని నగరం నుంచి తరలిపోయినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
-
ఆహారం దొరక్క ఎల్వివ్లో 2 లక్షల మంది ఉక్రేనియన్ల అవస్థలు
200,000 నిరాశ్రయులైన చెందిన ఉక్రేనియన్లకు ఆహారం, అందించడానికి తాను కష్టపడుతున్నానని ఎల్వివ్ మేయర్ చెప్పారు. పశ్చిమ ఉక్రెయిన్లో ఉన్న నగరం, దేశంలోని యుద్ధ-దెబ్బతిన్న ప్రాంతాల నుండి వలసపోతున్నారన్నారు. సుమారు 200,000 మంది ఉక్రేనియన్లకు ఆహారం, గృహాలను అందించడానికి కష్టపడుతున్నామన్నారు.
-
202 పాఠశాలలు, 34 ఆసుపత్రులు ధ్వంసం
సుమీ దాడిలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇక్కడ రష్యా సైన్యం 500 కిలోల బాంబుతో దాడి చేసింది. రష్యా దాడిలో 202 పాఠశాలలు ధ్వంసమయ్యాయి. 34 ఆసుపత్రులు కూడా శిథిలాల కుప్పలా మారాయి. జైటోమిర్లోని పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది.
-
ఉక్రెయిన్లో 12 వేల మంది రష్యన్ సైనికులు మృతి
ఉక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24 నుండి ఇప్పటివరకు 12,000 మంది రష్యన్ సైనికులు మరణించారని తెలిపింది. అదే సమయంలో 303 ట్యాంకులు ధ్వంసమయ్యాయి. ఇది కాకుండా, రష్యాకు చెందిన 1036 యూనిట్ల సాయుధ పోరాట వాహనాలు, 120 ఫిరంగి వ్యవస్థలు, 56 MLRS, 27 వైమానిక రక్షణ వ్యవస్థలు, 48 విమానాలు, 80 హెలికాప్టర్లు, 474 ఆటోమోటివ్ టెక్నాలజీ,3 పడవలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
-
మానవతా కారిడార్లోనూ వేధిస్తున్ రష్యాః జెలెన్స్కీ
మానవతా ప్రాతిపదికన కారిడార్ను తమ దేశానికి ఇవ్వాలని సోమవారం ఒప్పందం చేసుకున్నప్పటికీ, రోడ్లన్నీ రష్యన్ ట్యాంకులు, రష్యన్ రాకెట్లు, రష్యన్ ల్యాండ్మైన్లతో” నిండిపోయాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. అర్ధరాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో, మారియుపోల్లోని పిల్లలతో సహా సాధారణ ప్రజలకు ఆహారం, మందులను పంపిణీ చేయడానికి అంగీకరించినప్పటికీ రోడ్లపై ల్యాండ్మైన్లు పెట్టారని జెలెన్స్కీ ఆరోపించారు. తాను కైవ్లో ఉన్నట్లు రుజువు చేసే తన కార్యాలయంలో చెక్కిన టేబుల్ వెనుక కూర్చున్నట్లు కనిపించారు. సోమవారం జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ పశ్చిమ భాగానికి బదులుగా తమ దేశం, మిత్రదేశమైన బెలారస్ గుండా వెళ్లేందుకు అనుమతించాలని రష్యా ప్రతిపాదించడం గమనార్హం.ఇది కేవలం నిరాశావాద చర్య అని.. చిన్న కారిడార్ను ప్రారంభించి రష్యా దుష్ప్రచారం చేస్తోందన్నారు.
Zelensky recalls Ukrainian personnel from peacekeeping forces https://t.co/Qx9UHMicHl
— ?????️ VAXXED THO ?️????? (@rogue_corq) March 8, 2022
-
రష్యాలో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేసిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
రష్యాపై ఆర్థిక ఆంక్షలు పెరుగుతున్నాయి. రష్యాలో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. సోమవారం రష్యాలో తన వాణిజ్య కార్యకలాపాలను తక్షణం అమలులోకి తెచ్చిన రెండవ ప్రధాన క్రెడిట్ రేటింగ్ సంస్థగా ఫిచ్ అవతరించింది. దేశం వెలుపల ఉన్న దాని విశ్లేషకులు బదులుగా కవరేజీని అందిస్తారని ఫిచ్ తెలిపింది.
-
రష్యా దాడిలో 9 మంది మృతి
ఉక్రెయిన్లోని సుమీలో రష్యా దాడిలో ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది చనిపోయారు. రెస్క్యూ సిబ్బంది ఇళ్ల శిథిలాల కింద నుంచి పౌరుల మృతదేహాలను బయటకు తీశారు.
-
రష్యాకు వ్యతిరేకంగా తమిళ విద్యార్థి
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ అనే విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్లోని పారామిలటరీ దళాలలో చేరారు. దీంతో అధికారులు అతని నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని కానీ తిరస్కరించడం జరిగిందని తెలిపారు. అయితే సాయినికేష్ 2018లో ఖార్కివ్లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. కానీ అతను జూలై 2022 నాటికి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అతని కుటుంబం సాయినికేష్తో కమ్యూనికేషన్ కోల్పోయింది. అతని తల్లిదండ్రులు రాయబార కార్యాలయం సహాయం కోరిన తర్వాత వారు సాయినికేష్ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు.
Ukraine Russia War
-
రష్యా, ఉక్రెయిన్ సైనిక బలం
రష్యా ఉక్రెయిన్ ఆర్మీ 2,80,000 1,25,600 యుద్ధ ట్యాంక్లు 13,367 2,119 ఫిరంగులు 5934 1,962 ఆయుధాలు కలిగిన వాహనాలు 19,783 2,870 ఎయిర్ ఫోర్స్ ట్రూప్స్ 1,65,000 35,000 ఎటాక్ ఎయిర్క్రాఫ్ట్ 1,328 146 ఎటాక్ హెలికాప్టర్లు 478+ 42 నేవీ 1,50,000 15,000 యుద్ధ నౌకలు 74 2 సబ్మెరైన్లు 51 0 -
రష్యా-ఉక్రెయిన్ సైనిక బలబలాలు
రష్యా సైనిక బలం 9 లక్షలు. ఉక్రెయిన్ సైనిక బలం 2 లక్షలు మాత్రమే. గత దశాబ్దకాలంలో రష్యా మిలటరీ బడ్జెట్ ఖర్చు 30 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఉక్రెయిన్ మిలటరీ బడ్జెట్ కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా డిఫెన్స్ బడ్జెట్ 15 రెట్లు ఎక్కువ.
-
శాంతి చర్చల్లో రష్యా వినిపించిన డిమాండ్లు
1. ఉక్రెయిన్ సైనిక చర్యను నిలిపివేయాలి 2. తటస్థంగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చాలి 3. క్రిమియాను రష్యా భూభాగంగానే గుర్తించాలి 4. డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించాలి
-
ఫలించని శాంతి చర్చలు
ఇప్పటి వరకూ ఈ రెండు దేశాల మధ్య మొత్తం మూడు ధఫాలుగా యుద్ధం జరగ్గా.. వాటిలో ఒకే ఒక్క కారిడార్ వ్యవహారం తప్ప.. మిగిలిన అన్ని డిమాండ్లకూ ఇరు పక్షాల మధ్య ఒప్పందాలు కుదరడం లేదు. తాజాగా మూడో దశ చర్చల్లోనూ రష్యా- ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరడం లేదు.
-
ఒంటరిగా బాలుడు ఏడుస్తూ సరిహద్దులు దాటుతూ…
శనివారం నాడు మెడికా పట్టణంలోని పోలిష్ సరిహద్దులో ఒంటరిగా ఒక బాలుడు నడుచుకుంటూ వస్తున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. తానూ బార్డర్ దాటుతూ ఒంటరిగా తనకు తానుగా ఏడుస్తున్న వీడియో బయటపడింది. అతను క్యారియర్ బ్యాగ్లో రక్సాక్, బొమ్మను తీసుకువెళుతున్నాడు. అతను కుటుంబంతో ఉన్నాడా లేడా అనేది స్పష్టంగా తెలియలేదు.
The little boy in tears crosses the border alone with a plastic bag in his hand. ☹️❤️ #Ukraine #Ukrainian #StopPutinNOW pic.twitter.com/A90i0rTNPU
— Eurovision Croatia ?? (@esccroatia) March 7, 2022
-
బాంబు దాడిలో ఏడేళ్ల చిన్నారి బలి
రష్యాలోని ఓ పాఠశాలపై బాంబు పేల్చడంతో ఉక్రెయిన్కు చెందిన 7 ఏళ్ల బాలిక మృతి చెందింది. బాలిక తాత ఆమెను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ సంఘటన ఓఖ్తిర్కా నగరంలో చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Russia Ukraine War1
-
దెబ్బతిన్న ఉక్రెయిన్ అణు కేంద్రం
రష్యా దాడితో ఉక్రెయిన్లోని రెండో అణు కేంద్రం కూడా దెబ్బతిన్నదని IAEA తెలిపింది. వైద్య, పారిశ్రామిక అవసరాల కోసం రేడియో ఐసోటోప్లను ఉత్పత్తి చేసే ఖార్కివ్లోని కొత్త అణు పరిశోధనా కేంద్రాన్ని ఆదివారం షెల్లింగ్ దెబ్బతీసిందని ఉక్రెయిన్ IAEAకి తెలిపింది. అయితే, సంఘటన స్థలంలో రేడియేషన్ స్థాయిలో పెరుగుదల లేదని స్పష్టం చేసింది.
-
రష్యా చమురుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు – అమెరికా
రష్యా చమురుపై ఆంక్షలు విధించడంపై వైట్హౌస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యా చమురు దిగుమతులను నిషేధించాలా వద్దా అనే దానిపై అధ్యక్షుడు జో బిడెన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి సోమవారం తెలిపారు. “ఆ చర్చలు అంతర్గతంగా కొనసాగుతున్నాయి. యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచరులు, భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకుంటామం” అని సకీ విలేకరుల సమావేశంలో చెప్పారు.
-
రష్యన్ టీవీ ఛానెల్లపై నిషేధం
లాట్వియా మరో 18 రష్యన్ టీవీ ఛానెల్ల ప్రసారాన్ని నిషేధించింది. అలాగే, జర్నలిస్ట్ వ్లాదిమిర్ సోలోవివ్ ఛానెల్ ‘సోలోవివ్ లైవ్’ని యూట్యూబ్ బ్లాక్ చేసింది.
-
52 రష్యా యుద్ధ విమానాల కూల్చివేత
12 రోజుల యుద్ధంలో ఉక్రేనియన్ పైలట్లు, యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ గన్నర్లు 52 శత్రు యుద్ధ విమానాలు, 69 హెలికాప్టర్లను కాల్చివేసినట్లు ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకటించింది.
-
625కి పైగా క్షిపణులను ప్రయోగించిన రష్యా
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా.. ఉక్రెయిన్పై చిన్న, మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో సహా 625 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. అయినప్పటికీ, రష్యా ఇటీవలి కాలంలో ఉపరితలం నుండి గగనతలం, క్రూయిజ్ క్షిపణులపై ఎక్కువగా ఆధారపడింది. ఎందుకంటే రష్యా దళాలు ఇప్పటికీ కైవ్, ఖార్కివ్ వంటి ప్రధాన నగరాల వెలుపల చిక్కుకుపోయాయి.
-
రష్యాపై ఆస్ట్రేలియా కొత్త ఆంక్షలు
రష్యాపై ఆస్ట్రేలియా మరో దఫా ఆంక్షలు విధించింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద రష్యన్ సాయుధ దళాలు, ఆరుగురు సీనియర్ రష్యన్ సైనిక కమాండర్లు, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో పాల్గొన్న పది మంది వ్యక్తులపై ఆంక్షలు విధించింది.
-
పలు నగరాల్లో కాల్పుల విరమణ
ఉక్రెయిన్లోని కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో రష్యా కాల్పుల విరమణ విధించింది. ఇక్కడ మానవ కారిడార్లు తెరవడం కోసం వెసులుబాటు కల్పిస్తున్నట్లు రష్యా పేర్కొంది.
-
1.68 లక్షల మంది రష్యాకు తరలింపు
ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రాంతం నుండి 1,68,000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రష్యాకు తరలించారని ఆ దేశ ప్రతినిధి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రకటించింది. గత 24 గంటల్లో 5,550 మంది సరిహద్దులు దాటారని రష్యా తెలిపింది.
-
జెలెన్స్కీకి అత్యున్నత గౌరవం
రష్యా దురాక్రమణను ఎదుర్కొంటూ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకుగానూ ఉక్రెయిన్ ప్రధాని వోలోడిమిర్ జెలెన్స్కీని అత్యున్నత గౌరవంతో సత్కరించనున్నట్లు చెక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ సోమవారం తెలిపారు.
-
జపాన్ చమురు శుద్ధి పరికరాల నిషేధం
రష్యాకు చెందిన చమురు శుద్ధి చేసే పరికరాలను ఎగుమతి చేయడాన్ని జపాన్ నిషేధించింది.
-
ఉక్రెయిన్ భద్రతా దళాలకు 1,000 డాలర్లు
ఉక్రేనియన్ మార్షల్ లా కింద సైనికులు, పోలీసులు, నేషనల్ గార్డ్, ఇతర సైనిక విధులు నిర్వహిస్తున్న వారికి అత్యవసర సేవల ఉద్యోగులకు నెలవారీ $1,000 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
UK పార్లమెంట్లో ప్రసంగించనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
UK పార్లమెంట్లో ప్రసంగించనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం రాత్రి 10:30 గంటలకు UK హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రసంగించనున్నారు.
-
20 వేల మంది భారతీయులు సురక్షితంగా తిరిగొచ్చారు
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి TS తిరుమూర్తి UNSC సమావేశంలో మాట్లాడుతూ, భారతీయులను తిరిగి తీసుకురావడానికి 80 కంటే ఎక్కువ విమానాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఉక్రెయిన్ సహా దాని పొరుగు దేశాల అధికారులు అందించిన సహకారంతో మేము భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు సదుపాయం కల్పించామన్నారు. ఉక్రెయిన్ నుండి దాదాపు 20,000 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తిరిగి వచ్చేలా చేయడంలో మేము విజయం సాధించాము. ఇతర దేశాల పౌరులు కూడా వారి వారి దేశాలకు తిరిగి రావడానికి మేము సహాయం చేసాము. రాబోయే రోజుల్లో మేము అలా చేయడానికి సిద్ధంగా ఉంటామని తిరుమూర్తి స్పష్టం చేశారు.
-
ఉక్రేనియన్ రవాణా నష్టం 10 బిలియన్ డాలర్లు
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ రవాణాకు 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. అదే సమయంలో, ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల మంత్రి, అలెగ్జాండర్ కుబ్రకోవ్, మేము ఈ నష్టాన్ని ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
-
మూడో విడత చర్చలు విఫలం
బెలారస్లో జరిగిన రష్యా – ఉక్రెయిన్ మధ్య మూడవ రౌండ్ శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. రష్యన్, ఉక్రేనియన్ ప్రతినిధులు అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. అయితే, ఉక్రెయిన్లోని మానవతా కారిడార్ల లాజిస్టిక్స్ను మెరుగుపరచడంలో కొంత చిన్న పురోగతి సాధించామని ఉక్రేనియన్ ప్రతినిధి బృందం సభ్యుడు మైఖైలో పోడోలిక్ తెలిపారు. కాల్పుల విరమణ, భద్రతా హామీలతో సహా ఒప్పందంలోని ప్రధాన రాజకీయ కూటమిపై లోతైన సంప్రదింపులు జరుగుతున్నాయని ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ హెడ్ ఆఫ్ ఆఫీస్ సలహాదారు పోడోలిక్ తెలిపారు.
-
రష్యా జనరల్ విటాలీ గెరాసిమోవ్ మృతి
రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో, రష్యా జనరల్ విటాలీ గెరాసిమోవ్ ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు తూర్పు యూరోపియన్ మీడియా NEXTA పేర్కొంది. రెండవ చెచ్న్యా యుద్ధంలో జనరల్ విటాలీ రష్యా తరపున పోరాడారు. ఇది కాకుండా, రష్యన్ జనరల్ సిరియన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ నుండి క్రిమియాను విముక్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు జనరల్ విటాలీ గెరాసిమోవ్.
#Russian general was liquidated near #Kharkiv
Major General Vitaly Gerasimov, who took part in the second #Chechen war, the war in #Syria and the annexation of #Crimea, was killed in battles near Kharkiv. pic.twitter.com/FzH7O1HVWf
— NEXTA (@nexta_tv) March 7, 2022
Published On - Mar 08,2022 7:37 AM