Rai Typhoon: ఫిలిప్పీన్స్​లో రాయ్‌ తుఫాను బీభత్సం.. 208 మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు..

Rai Typhoon: ఫిలిప్పీన్స్​ దేశంలో "రాయ్‌ తుఫాను" బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి ఆదేశంలో జన జీవన అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 208లకు..

Rai Typhoon: ఫిలిప్పీన్స్​లో రాయ్‌ తుఫాను బీభత్సం.. 208 మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు..
Philippines
Follow us

|

Updated on: Dec 20, 2021 | 8:30 AM

Rai Typhoon: ఫిలిప్పీన్స్​ దేశంలో “రాయ్‌ తుఫాను” బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ దాటికి ఆదేశంలో జన జీవన అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి మరణించిన వారి సంఖ్య 208లకు చేరుకుందని ఆ దేశ అధికారులు చెప్పారు. ఆ దేశంలో ఇటీవల కాలంలో తుఫాను వలన ఒకేసారి ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారి. రాయ్​ తుఫాను గంటకు 195 కిలోమీటర్లు (120 మైళ్లు) వేగంతో గాలులు వీచినట్లు అధికారులు చెప్పారు. తీవ్ర గాలుల ధాటికి సియార్‌గావ్, దినాగట్, మిండనావో దీవుల్లో కూడా భారీ విధ్వంసం జరిగింది. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇక ఆర్చిపెలాగోలోని సౌథర్న్‌, సెంట్రల్‌ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని పోలీసులు చెప్పారు. రాయ్ తుఫాన్ సృష్టించిన విధ్వసంతో ఫిలిప్పీన్స్​ లోని కోస్తా ప్రాంతం మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని రెడ్‌క్రాస్‌ సంస్థ చెప్పింది.

అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

సియార్‌గావో ద్వీపంలోని ప్రముఖ పర్యాటక పట్టణం జనరల్ లూనాలోకి క్రిస్మస్  సందర్భంగా భారీగా పర్యాటకులు వచ్చారు. అయితే ఇప్పుడు తుఫాన్ ద్వీపంలో సృష్టించిన విధ్వసంతో స్థానికులు సహా పర్యాటకులు మంచి నీరు, ఆహారం కోసం కష్టపడుతున్నారు. దేశ వ్యాప్తంగా తుఫాను నష్టం పూర్తి స్థాయిని అంచనా వేయడానికి విపత్తు ఏజెన్సీ రంగంలోకి దిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది.  బాధితులకు సహాయం కోసం వేలాది మంది మిలిటరీ, పోలీసు, కోస్ట్ గార్డ్ , అగ్నిమాపక సిబ్బంది,  రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి.. తుఫాన్ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

ఆహారం, నీరు , వైద్య సామాగ్రిని తరలించారు.  రోడ్లపై పడిపోయిన విద్యుత్ స్తంభాలు, చెట్లను క్లియర్ చేస్తున్నారు.   ఫిలిప్పీన్స్‌  లో ఎక్కువగా తుఫానులు సాధారణంగా జూలై  – అక్టోబర్ మధ్య ఏర్పడతాయి. రోజు రోజుకీ  వాతారణంలో కలిగే  మార్పుల కారణంగా ప్రపంచం వేడెక్కుతున్నందున తుఫాన్లు మరింత శక్తివంతం అవుతున్నాయని శాస్త్రవేత్తలు  గత కొంత కాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  సన్నీ విన్నర్‌గా నిలవడంపై తల్లి కళావతి హర్షం.. స్నేహానికి విలువ ఇస్తాడంటూ..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..