AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Princess Diana: వేలానికి ప్రిన్సెస్ డయానా నక్లెస్ .. ధరెంతో తెలుసా..?

డయానా నెక్లెస్‌ను అమెరికన్ వ్యాపారవేత్త జిమ్ మెక్‌కింగ్‌వాల్ 1999లో కేవలం 1 మిలియన్‌కు కొనుగోలు చేశారు. కానీ, అతను దానిని 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో రాజకుటుంబానికి పెద్ద అభిమానులైన ఉక్రేనియన్ కుటుంబానికి విక్రయించాడు. ఇప్పుడు

Princess Diana: వేలానికి ప్రిన్సెస్ డయానా నక్లెస్ .. ధరెంతో తెలుసా..?
Princess Diana
Jyothi Gadda
|

Updated on: May 14, 2023 | 7:58 AM

Share

ప్రపంచం మెచ్చిన యువరాణి డయానాను ఎవరు మర్చిపోలేరు. ఆమె అందం, మాటలు, హావభావాలు, ఆమె ధరించిన దుస్తులు ఇలా ఆమె జీవితంలోని ప్రతి అంశం ప్రజలకు నచ్చింది. కానీ, 36 ఏళ్ల వయస్సులోనే యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించింది. నేటికీ ఆమె మరణంపై ప్రజల్లో అనేక సందేహాలు మిగిలే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆభరణాలను వేలం వేయనున్నారు. యువరాణి డయానా స్వాన్ లేక్ నెక్లెస్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆభరణాలలో ఒకటి. ఈ హారాన్ని 1997లో ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రిన్సెస్ డయానా ధరించారు. బ్రిటిష్ మీడియా ప్రకారం, ఈ నెక్లెస్ 178 వజ్రాలు, ఐదు ముత్యాలతో తయారు చేయబడింది. అప్పటి క్రౌన్ జ్యువెలర్ గారర్డ్ ఈ విలువైన హారాన్ని తయారు చేసినట్లు తెలిసింది.

ఈ నెక్లెస్ 10 మిలియన్ పౌండ్లకు అమ్ముతున్నట్లు సమాచారం.. వచ్చే నెల (జూన్)లో వేలం నిర్వహించనున్నారు. ఈ నెక్ లెస్ కి 10 మిలియన్లు (రూ. 1,03,33,40,118.00) లభిస్తుందని నమ్ముతారు. డయానా ప్రైవేట్ ఆభరణాలను బహిరంగంగా విక్రయించడం ఇదే తొలిసారి. న్యూయార్క్‌లో వేలం వేయడానికి ముందు వాటిని లండన్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. న్యూయార్క్‌లోని గ్వెర్న్సీ వేలంపాట జరుగుతుంది. డయానా రాజకుటుంబంలో సభ్యురాలిగా ఉన్నప్పుడు ధరించే నగలు చాలా వరకు ఆమెకు ఇచ్చింది. స్వాన్ హార్ 2008 నుండి ఉక్రేనియన్ కుటుంబానికి చెందినది.

డయానా కోసం తయారు చేసిన స్వాన్ లేక్ నెక్లెస్‌కు సరిపోయేలా చెవిపోగులు కూడా తయారు చేయబడ్డాయి. కానీ, ఆమె అకాల మరణానికి ముందు అది కుదరలేదు. అందువలన, డయానా మరణం తర్వాత, ఆమె కుటుంబం నెక్లెస్ కు సరిపోలే చెవిపోగులు విక్రయించడానికి అనుమతించింది. వచ్చిన మొత్తంలో కొంత యూనిసెఫ్‌కు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

డయానా నెక్లెస్‌ను అమెరికన్ వ్యాపారవేత్త జిమ్ మెక్‌కింగ్‌వాల్ 1999లో కేవలం 1 మిలియన్‌కు కొనుగోలు చేశారు. కానీ, అతను దానిని 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో రాజకుటుంబానికి పెద్ద అభిమానులైన ఉక్రేనియన్ కుటుంబానికి విక్రయించాడు. ఇప్పుడు కుటుంబం ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం ఈ నెక్లెస్ను విక్రయించాలని నిర్ణయించుకుంది. జూన్ 27న వేలం వేయనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై