AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా కాస్య విగ్రహం చోరీ..!

మెలానియా ట్రంప్ స్వస్థలమైన స్లోవేనియాలో ఆమె కాంస్య విగ్రహం దొంగిలించబడింది. ఇది 2020లో దహనం చేయబడిన చెక్క విగ్రహానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబడింది. స్లోవేనియన్ పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. ఈ విగ్రహం అమెరికన్ కళాకారుడు బ్రాడ్ డౌనీచే రూపొందించబడింది. విగ్రహం మెలానియాకు పోలికను కలిగిలేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా కాస్య విగ్రహం చోరీ..!
Melania Trump Statue
SN Pasha
|

Updated on: May 17, 2025 | 7:20 PM

Share

డొనాల్డ్‌ ట్రంప్ సతీమణ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కాంస్య విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. ఆమె స్వస్థలంలో ఏర్పాటు విగ్రహం చోరీకి గురైంది. ప్రస్తుతం దుండగుల కోసం స్లోవేనియన్ పోలీసులు గాలిస్తున్నారు. 1970లో మెలానియా నాస్ జన్మించిన సెంట్రల్ స్లోవేనియాలోని సెవ్నికా సమీపంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి పదవీకాలంలో ఈ జీవిత పరిమాణ శిల్పాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. తొలుత చెక్కతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఎవరో నిప్పంటించారు. దాని స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్లోవేనియన్ మీడియా నివేదికల ప్రకారం.. కాంస్య ప్రతిరూపాన్ని చీలమండల వద్ద కోసి తొలగించారు.

విగ్రహం దొంగతనం గురించి మంగళవారం పోలీసులకు సమాచారం అందిందని, బాధ్యులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు ప్రతినిధి అలెంకా డ్రెనిక్ రంగస్ తెలిపారు. ఈ శిల్పాన్ని అమెరికన్ కాన్సెప్చువల్ ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ రూపొందించారు. ఇది జూలై 2020లో దహనం చేయబడిన అసలు చెక్క విగ్రహాన్ని భర్తీ చేసింది. లిండెన్ చెట్టు కాండం నుండి కత్తిరించిన గ్రామీణ బొమ్మ, 2017లో ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో ధరించిన లేత నీలం రంగు దుస్తులు ధరించిన ప్రథమ మహిళను ప్రతిబింబిస్తుంది. అయితే కాంస్య విగ్రహం మాత్రం ప్రథమ మహిళకు స్పష్టమైన పోలికను కలిగి లేదనే విమర్శలు కూడా వచ్చాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి