AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మాకు అక్కరలేదు..శాంతియుత మార్గాలను అనుసరించే దేశాలతో కలిసి పనిచేస్తాం.. అమెరికా

ప్రపంచాన్ని విభాజించాలనుకునే కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మాకు అక్కరలేదు. శాంతియుతంగా ముందుకు సాగాలని కోరుకునే అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది.

Joe Biden: కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మాకు అక్కరలేదు..శాంతియుత మార్గాలను అనుసరించే దేశాలతో కలిసి పనిచేస్తాం.. అమెరికా
Joe Biden
KVD Varma
|

Updated on: Sep 22, 2021 | 9:51 AM

Share

Joe Biden: ప్రపంచాన్ని విభాజించాలనుకునే కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మాకు అక్కరలేదు. శాంతియుతంగా ముందుకు సాగాలని కోరుకునే అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన వైఫల్యాల పర్యవసానాలను ఇప్పటికే మనందరం అనుభవించామని చైనాతో విభేదాల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 76 వ సెషన్‌లో ప్రసంగిస్తూ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ, 20 సంవత్సరాల క్రితం 9/11 న దాడికి గురైన సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న దేశం ప్రస్తుత అమెరికా కాదని ఆయన అన్నారు. ఈ రోజు మనం మునుపటి కంటే మెరుగ్గా, బలంగా ఉన్నామని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా భీభత్సాన్ని ఆశ్రయించే వారు మాకు అతిపెద్ద శత్రువు అవుతారని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అడుగడుగునా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా తన మిత్రదేశాలతో కలిసి నిలుస్తుందని అయన స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, అక్కడి పరిస్థితుల గురించి కూడా బిడెన్ మాట్లాడారు. తీవ్రవాదం చేదు కాటు మనకు తెలుసు. గత నెలలో కాబూల్ విమానాశ్రయంపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో 13 మంది సైనికులు, అనేక మంది ఆఫ్ఘన్ పౌరులను కోల్పోయాము. సైనిక శక్తి మన చివరి సాధనంగా ఉండాలి, మొదటిదిగా కాదు అని ఆయన వివరించారు. ఈ రోజు మనం తీవ్రవాదం వంటి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నామని అమెరికా అధ్యక్షుడు అన్నారు. మేము ఆఫ్ఘనిస్తాన్‌లో 20 సంవత్సరాల సంఘర్షణను ముగించాము. యుద్ధం ముగిసిన తర్వాత, మేము దౌత్యం తలుపులు తెరుస్తున్నాము. మన భద్రత, శ్రేయస్సు, స్వేచ్ఛ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.యు ప్రపంచంలోని అన్ని సవాళ్లకు వ్యతిరేకంగా మనం మునుపటిలా కలిసి పనిచేయాలి అని బిడెన్ స్పష్టం చేశారు.

ఆయుధ పోటీ గురించి బిడెన్ ప్రపంచాన్ని హెచ్చరించాడు. ఆయన ఈ హెచ్చరిక ఉత్తర కొరియా, ఇరాన్ నుంచి వస్తున్న ఆయుధ పోటీ గురించి చేశారనేది స్పష్టం. ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా నిరోధించడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. దౌత్యం ద్వారా కొరియా ద్వీపకల్పంలో శాంతిని కూడా కోరుకుంటున్నామని బిడెన్ చెప్పారు. కరోనా వంటి అంటువ్యాధి లేదా దాని భవిష్యత్ వైవిధ్యాల నుండి రక్షించడానికి ఆయుధాలను ఉపయోగించలేమని, అయితే ఇది సైన్స్, రాజకీయాల సమిష్టి సంకల్పం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

తన ప్రసంగంలో, ఆయన భారతదేశాన్ని ప్రస్తావించారు. ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము క్వాడ్ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచామని చెప్పారు. శాంతియుత తీర్మానాలను అనుసరించే ఏ దేశంతోనైనా కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

Also Read: SAARC: తాలిబాన్ ప్రాతినిధ్యం కోసం పాకిస్తాన్ పట్టుదల.. వ్యతిరేకించిన భారత్.. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశం వాయిదా!

Havana Syndrome: షాకింగ్.. హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా? అమెరికా ఇంటెలిజన్స్ అధికారికి సిండ్రోమ్ లక్షణాలు

Follow Us