ఎగిరే ఉడుత కనిపించిందోచ్.. అంతరించిపోయింది అనుకుంటే..
అంతరించిపోయిన జంతుజాలంలో ఒకటిగా భావించిన ఎగిరే ఉడుతను హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ గుర్తించింది. లాహౌల్-స్పితి జిల్లాలోని మియార్ లోయలో కనిపించిన ఉడుత శరీరం అంతా ఉన్నితో కప్పబడి ఉంది. ఈ అరుదైన ఉడుత కెమెరాలకు చిక్కినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కెమెరా ట్రాపింగ్ సర్వేలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.
దీని శాస్త్రీయనామం యూపెటౌరస్ సినేరియస్ . ఈ జాతికి చెందిన ఉడుత చివరిసారిగా 1994లో కనిపించింది. ఆ తర్వాత అది అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ కనిపించడంతో జీవశాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలు ఫలించాయని చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తామని హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. దేశంలో మంచు చిరుతల జనాభా లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ట్రాప్ కెమెరాలు అమర్చగా… వాటిలో ఎగిరే ఉడుత విజువల్స్ రికార్డయ్యాయి. మియార్ లోయలోని వ్యూహాత్మక ప్రాంతాలలో 62 కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. స్పితిలోని కిబ్బర్ నుండి వచ్చిన స్థానిక యువకుల బృందం 2010 నుంచి సంరక్షణ ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. వీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎగిరే ఉడుతతో పాటు, కెమెరా ట్రాప్లు మంచు చిరుత, ఎర్ర నక్క, హిమాలయ తోడేలు, కొండ ముంగిస తదితర జాతుల జంతువుల ఫొటోలను కూడా రికార్డు చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

