ఎగిరే ఉడుత కనిపించిందోచ్.. అంతరించిపోయింది అనుకుంటే..
అంతరించిపోయిన జంతుజాలంలో ఒకటిగా భావించిన ఎగిరే ఉడుతను హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ గుర్తించింది. లాహౌల్-స్పితి జిల్లాలోని మియార్ లోయలో కనిపించిన ఉడుత శరీరం అంతా ఉన్నితో కప్పబడి ఉంది. ఈ అరుదైన ఉడుత కెమెరాలకు చిక్కినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కెమెరా ట్రాపింగ్ సర్వేలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.
దీని శాస్త్రీయనామం యూపెటౌరస్ సినేరియస్ . ఈ జాతికి చెందిన ఉడుత చివరిసారిగా 1994లో కనిపించింది. ఆ తర్వాత అది అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ కనిపించడంతో జీవశాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలు ఫలించాయని చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తామని హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. దేశంలో మంచు చిరుతల జనాభా లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ట్రాప్ కెమెరాలు అమర్చగా… వాటిలో ఎగిరే ఉడుత విజువల్స్ రికార్డయ్యాయి. మియార్ లోయలోని వ్యూహాత్మక ప్రాంతాలలో 62 కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. స్పితిలోని కిబ్బర్ నుండి వచ్చిన స్థానిక యువకుల బృందం 2010 నుంచి సంరక్షణ ప్రయత్నాలలో నిమగ్నమై ఉంది. వీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎగిరే ఉడుతతో పాటు, కెమెరా ట్రాప్లు మంచు చిరుత, ఎర్ర నక్క, హిమాలయ తోడేలు, కొండ ముంగిస తదితర జాతుల జంతువుల ఫొటోలను కూడా రికార్డు చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో
పాతబస్తీలో రెచ్చిపోయిన ఆటోడ్రైవర్..
సింగరేణి ఖిల్లాలో 'అమెరికా' కోడలు
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

