పంబన్ రైల్వే బ్రిడ్జ్.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
పంబన్ రైల్వే బ్రిడ్జ్...దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూ భాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జి. నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే పాత వంతెన కట్టి వందేళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం దాదాపు ముగియడంతో పంబన్లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు.
పంబన్ పాత రైల్వే బ్రిడ్జి.. నౌకలు వచ్చినప్పుడు, రెండు భాగాలుగా ఓపెన్ అయి ఓడలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం… నౌకలు వచ్చినప్పుడు…లిఫ్ట్ లాగా పైకి వెళుతుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45గంటలకు ప్రధాని మోదీ పంబన్ నుంచి రిమోట్ నొక్కి వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్ తొలిసారి కొత్త బ్రిడ్జి కింద నుంచి వెళ్లింది. రామేశ్వరం ద్వీపంలోని ఈ పంబన్ ప్రాంతానికి, రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుంచి వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును నిర్మించాడని రామాయణం చెబుతోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంబన్ వంతెన ఓ వారధిలా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!
అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

