పంబన్ రైల్వే బ్రిడ్జ్.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్
పంబన్ రైల్వే బ్రిడ్జ్...దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూ భాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జి. నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. అయితే పాత వంతెన కట్టి వందేళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం దాదాపు ముగియడంతో పంబన్లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు.
పంబన్ పాత రైల్వే బ్రిడ్జి.. నౌకలు వచ్చినప్పుడు, రెండు భాగాలుగా ఓపెన్ అయి ఓడలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం… నౌకలు వచ్చినప్పుడు…లిఫ్ట్ లాగా పైకి వెళుతుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45గంటలకు ప్రధాని మోదీ పంబన్ నుంచి రిమోట్ నొక్కి వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్ తొలిసారి కొత్త బ్రిడ్జి కింద నుంచి వెళ్లింది. రామేశ్వరం ద్వీపంలోని ఈ పంబన్ ప్రాంతానికి, రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుంచి వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును నిర్మించాడని రామాయణం చెబుతోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంబన్ వంతెన ఓ వారధిలా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఒక్కసారిగా
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసారు..చివరికి ఇలా…!
అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

