BJP Digital Campaign: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ డిజిటల్ ప్రచారం.. రంగంలోకి ప్రవాస భారతీయులు!

UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయులను బీజేపీ(BJP)రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది.

BJP Digital Campaign: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ డిజిటల్ ప్రచారం.. రంగంలోకి ప్రవాస భారతీయులు!
Up Electionss
Follow us

|

Updated on: Jan 24, 2022 | 12:17 PM

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయులను బీజేపీ(BJP)రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్(Chandrakanth Patel) శనివారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ‘అబ్కీ బారీ ఇన్ ఉత్తరప్రదేశ్ రామ్ రాజ్య కీ తయ్యారీ’ అనే డిజిటల్ ప్రచారాన్ని(BJP Digital Campaign) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ ఉపాధ్యక్షుడు మాధవ్ భండారి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

క్యాంపెయిన్ కోఆర్డినేటర్ సంతోష్ గుప్తా మాట్లాడుతూ.. విదేశాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ వంతు సహకారం అందించాలనుకుంటున్నారు. కాబట్టి, వ్యక్తిగతంగా భారతదేశానికి రాలేని వారు డిజిటల్ యాప్‌ని ఉపయోగించి తమ సందేశాన్ని బిజెపికి మద్దతు ఇవ్వాలన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రచారానికి తమదైన రీతిలో సహకరించిన ఎన్నారైల బలమైన నెట్‌వర్క్ మా వద్ద ఉందని గుప్తా చెప్పారు. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సహకరించిన ఎన్నారైలు ఉన్నారని బీజేపీ నేత అన్నారు.

మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తల బృందం ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రధాన నియోజకవర్గాల్లో ఇంటింటికి ప్రచారం ప్రచారం కూడా చేపట్టనుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని చాలా మంది బిజెపి కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు అప్పుడే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త వారి గ్రామాలు, తాలూకాలలోని 25 నుండి 50 ఇళ్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also…. Viral Video: పుష్పరాజ్ మేనరిజానికి ఫిదా అయిన బంగ్లాదేశ్ క్రికెటర్.. మైదానంలోనే పుష్ప క్రేజ్..