AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ulas family : నేటికి నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం.. అచ్చం ఆదిమానవుల్లా.. శాస్త్రవేత్తలకే షాక్..!

ఆధునిక దశ నుంచి వచ్చిన మానవుడు మళ్లీ జంతు స్థితికి వస్తాడని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.  మానవ జాతి నాగరికత సాధించినా వీరు మాత్రం ఈనాటికి నాలుగు కాళ్లమీదనే నడుస్తున్నారు. వీరిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. వీళ్ల పరిస్థితికి కారణం ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఈ కుటుంబంలో నివసిస్తున్న ఐదుగురు తోబుట్టువుల గురించి 2000 సంవత్సరంలో ఒక శాస్త్రీయ కథనం వెలుగులోకి వచ్చింది.

Ulas family : నేటికి నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం.. అచ్చం ఆదిమానవుల్లా.. శాస్త్రవేత్తలకే షాక్..!
Ulas Family In Turkey
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2023 | 6:58 PM

Share

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మనుషులు ఉన్నారు. ఇందులో కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. వారు చేసే చిత్ర విచిత్రమైన పనులు, చేష్టల కారణంగా వారు వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే మనుషుల్లా రెండు కాళ్లతో కాకుండా జంతువులలాగా నాలుగు కాళ్లతో నడిచే కుటుంబం గురించి ఎప్పుడైన విన్నారా..? సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇలాంటి మనుషులపై తీవ్ర చర్చ జరుగుతోంది. వారు రెండు కాళ్లతో పాటుగా రెండు చేతులను కూడా కాళ్లుగా వాడుకుంటారు. ఇలాంటి కుటుంబం టర్కియేలోని మారుమూల గ్రామంలో నివసిస్తుంది. ఈ కుటుంబంలో నివసిస్తున్న ఐదుగురు తోబుట్టువుల గురించి 2000 సంవత్సరంలో ఒక శాస్త్రీయ కథనం వెలుగులోకి వచ్చింది. ఇందులో వారు నడుస్తున్న తీరును కూలంకషంగా వివరించారు.

వార్తల్లో ఈ విషయం వెల్లడైన కొన్ని సంవత్సరాల తర్వాత.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో మనస్తత్వవేత్త అయిన ప్రొఫెసర్ నికోలస్ హంఫ్రీ వీరి కుటుంబాన్ని కలవడానికి టర్కీకి వెళ్లారు. ఉలాస్ కుటుంబంలోని ఆ దంపతులకు 18 మంది పిల్లలు ఉన్నారు. అయితే, వారిలో ఆరుగురు మాత్రం జంతువులలా నడుస్తున్నారు. ఇది మునుపెన్నడూ చూడని విషయం. ఈ కుటుంబంపై ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. టర్కీలోని ఈ ఉలాస్ కుటుంబం గురించి ఆస్ట్రేలియా 60 నిమిషాలు డాక్యుమెంటరీలో ప్రదర్శించింది. ఈ అసాధారణ లక్షణం ఇంతకు ముందు ‘ ది ఫామిలి దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్స్’లో నమోదు చేయబడింది. ఇందులో హంఫ్రీ మాట్లాడుతూ.. ఆధునిక దశ నుంచి వచ్చిన మానవుడు మళ్లీ జంతు స్థితికి వస్తాడని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.  మానవ జాతి నాగరికత సాధించినా వీరు మాత్రం ఈనాటికి నాలుగు కాళ్లమీదనే నడుస్తున్నారు. వీరిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. వీళ్ల పరిస్థితికి కారణం ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు.

శాస్త్రవేత్తల పరిశోధన అనంతరం.. వీరిలో ఏదో జన్యుపరమైన సమస్య వల్ల ఇలా జరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరుగురు తోబుట్టువులలో ఐదుగురు ఇప్పటికీ జీవించి ఉన్నారు. వీరి వయస్సు 22 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరందరిలో మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కూడా చెప్పారు. డాక్టర్ డాక్యుమెంటరీలో MRI స్కాన్‌లను కూడా చూపించాడు. అందులో ప్రతి ఒక్కరి మెదడులోని సెరెబెల్లార్ వెర్మిస్ అని పిలువబడే ఒక భాగం కుంచించుకుపోయిందని చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రజలు జంతువుల మాదిరి నాలుగు కాళ్లపై నడుస్తారని చెప్పలేమన్నారు.. ఎందుకంటే సెరెబెల్లార్ వర్మిస్ ఉన్న ఇతర వ్యక్తులు మనుషుల మాదిరిగానే రెండు కాళ్లపై నడుస్తారు. దీనికి విరుద్ధంగా ఈ కుటుంబంలోని వ్యక్తులు తమ రెండు చేతులను పాదాల వలె ఉపయోగిస్తారు. ఈ కుటుంబంపై అనేక ఇతర డాక్యుమెంటరీలు కూడా రూపొందించబడ్డాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..