AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలపాతం ఒడ్డున దంపతుల ఫోటో షూట్‌.. ముంచుకొచ్చిన రాకాసి అలలు.. ఫోటోగ్రాఫర్‌ చెప్పిన మాటతో ఆ జంట ప్రాణం..!

ఆ ఇద్దరూ నిలబడి ఉన్న చోట ఆ ప్రదేశం చాలా చిన్నదిగా ఉంది. అది కూడా ఓ చిన్న కొండలా కనిపిస్తుంది. దిగువన సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దూరంలో జలపాతాలు ఎంతో ఉదృతంగా, కనులకు విందుగా కనిపిస్తుంది. అవన్నీ తమ ఫోటోలో కనిపించే విధంగా ఆ జంట పోజులు పెడుతుండగా, ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోను క్లిక్‌మనిపించాలని అడుగుతారు.. అయితే, అందుకు ఆ ఫోటోగ్రాఫర్‌.. అక్కడ్నుంచి కాదు.. ముందుకు రావాలంటూ వారిని

జలపాతం ఒడ్డున దంపతుల ఫోటో షూట్‌.. ముంచుకొచ్చిన రాకాసి అలలు.. ఫోటోగ్రాఫర్‌ చెప్పిన మాటతో ఆ జంట ప్రాణం..!
photo shoot
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2023 | 5:39 PM

Share

సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇందులో ఓ జంట అందమైన వాటర్‌ఫాల్‌ అంచున ఎంజాయ్ చేయడం చూడవచ్చు. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు దూరం నుండి జలపాతాన్ని మైమరచిపోతున్నారు.. కానీ కొన్ని సెకన్లలో అక్కడ ఊహించని భయానకం జరిగింది. ఇది అక్కడ ఎవరూ ఊహించలేదు. అదృష్టవశాత్తు ఈ జంట తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ క్షణంలో ఫోటోగ్రాఫర్ మనస్సులో వచ్చిన ఆలోచన ఆ ఇద్దరినీ బ్రతికించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్‌ని ప్రశంసిస్తున్నారు. దంపతుల ప్రాణాలు నిలబెట్టిన ఫోటోగ్రాఫర్‌ నిజంగా దేవుడు అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

వీడియో ప్రారంభంలో ఒక జంట రెండు రాళ్లు కిందకు దిగి తమను ఫోటో తీయాలంటూ ఫోటోగ్రాఫర్‌ని అడుగుతారు. ఆ ఇద్దరూ నిలబడి ఉన్న చోట ఆ ప్రదేశం చాలా చిన్నదిగా ఉంది. అది కూడా ఓ చిన్న కొండలా కనిపిస్తుంది. దిగువన సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దూరంలో జలపాతాలు ఎంతో ఉదృతంగా, కనులకు విందుగా కనిపిస్తుంది. అవన్నీ తమ ఫోటోలో కనిపించే విధంగా ఆ జంట పోజులు పెడుతుండగా, ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోను క్లిక్‌మనిపించాలని అడుగుతారు.. అయితే, అందుకు ఆ ఫోటోగ్రాఫర్‌.. అక్కడ్నుంచి కాదు.. ముందుకు రావాలంటూ వారిని తిరిగి రమ్మని అడిగాడు. దాంతో ఆ ఇద్దరూ ముందుకు తిరిగి వచ్చేశారు.. ఇంతలోనే పెను ఉప్పెన ముంచేసింది. పెద్ద ఎత్తున నీటి కెరటం వారు నిలబడి ఉన్న ప్రదేశాన్ని ఊడ్చేసుకుపోయింది. సమీపంలోని ప్రజలంతా భయంతో కేకలు వేస్తూ.. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దూరంగా పరిగెత్తారు. ఇదంతా దూరం నుంచి వీడియో తీశారు కొందరు సందర్శకులు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అదికాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సచ్కద్వాహై అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ సంఘటన ఇండోనేషియాలోని బాలికి చెందినదిగా తెలిసింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వీరి అదృష్టం బాగుంది.. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు. అర క్షణం ఆలస్యం అయినట్టయితే.. ఏం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం