లైవ్లపై ఆంక్షలు విధించనున్న ఫేస్బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్బుక్ లైవ్లను మానిటర్ చేయనుంది. ఈ మేరకు లైవ్లో కొన్ని ఆంక్షలు కూడా విధించాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్బెర్గ్ తన బ్లాగ్లో వెల్లడించారు. ప్రామాణిక అంశాలపై ఆధారపడి ఫేస్బుక్లో ఎవరు లైవ్కు వెళ్లొచ్చు అనే విషయాన్ని ఫేస్బుక్ పరిశీలిస్తోందని ఆమె వెల్లడించారు. కాగా ఇటీవల న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో జరిగిన నరమేధం ఫేస్బుక్లో లైవ్ అయింది. […]

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్బుక్ లైవ్లను మానిటర్ చేయనుంది. ఈ మేరకు లైవ్లో కొన్ని ఆంక్షలు కూడా విధించాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్బెర్గ్ తన బ్లాగ్లో వెల్లడించారు. ప్రామాణిక అంశాలపై ఆధారపడి ఫేస్బుక్లో ఎవరు లైవ్కు వెళ్లొచ్చు అనే విషయాన్ని ఫేస్బుక్ పరిశీలిస్తోందని ఆమె వెల్లడించారు. కాగా ఇటీవల న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో జరిగిన నరమేధం ఫేస్బుక్లో లైవ్ అయింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో తమ మాధ్యమంలో మరిన్ని ఆంక్షలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లైవ్లు, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఆంక్షలను విధించనున్నారు.