AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: జపాన్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.1గా భూకంప తీవ్రత.. సునామీ ముప్పులేదన్న..

ఇటీవల టర్కీ, సిరియాలో భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించిన సమయంలో జపాన్‌లో ఈ ప్రకంపనలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు దేశాల్లో 50 వేల మందికి పైగా మరణించారు.

Earthquake: జపాన్‌లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.1గా భూకంప తీవ్రత.. సునామీ ముప్పులేదన్న..
Earthquake
Sanjay Kasula
|

Updated on: Feb 26, 2023 | 7:04 AM

Share

ప్రకృతికి ఎప్పుడు కోపం వస్తుందో.. ఆ ప్రకోపంలో ఎంతటి విధ్వంసం కలుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అవును… మొన్నటి తైవాన్‌ కకావికలం ఇంకా కళ్ల ముందే కదిలాడుతోంది. ఇంతలో ఎక్కడోఒక్కచోట భూమి కంపిస్తోంది. జపాన్ నుంచి పెద్ద వార్త వెలువడుతోంది. హక్కైడో ద్వీపం తూర్పు భాగంలో శనివారం (ఫిబ్రవరి 25) సాయంత్రం భూకంపం బలమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ మేరకు యూఎస్‌జీసీ అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:27 గంటలకు భూకంపం సంభవించింది. అంతకుముందు ఫిబ్రవరి 20న జపాన్‌లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత ఈరోజు అంటే శనివారం (ఫిబ్రవరి 25) కంటే తక్కువగా ఉన్నప్పటికీ. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది.

టర్కీలో మళ్లీ కంపించిన భూమి

మరోవైపు, శనివారం (ఫిబ్రవరి 25) టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్, “భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఫిబ్రవరి 6 న సంభవించిన 3 భూకంప ప్రకంపనలలో సుమారు 48 వేల మంది మరణించారు.”

మరిన్ని అంతర్జీయ వార్తల కోసం

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం